వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకటి కాదు.. రెండు కాదు 20వ సారి గర్భం.. పదుల సంఖ్యలో పిల్లలు...

|
Google Oneindia TeluguNews

ముంబై : అవును మీరు చదివింది నిజమే. ఓ మహిళ 20వ సారి గర్భం దాల్చింది. ఎక్కడో కాదు మన పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో జరిగింది ఈ ఘటన. ఆమె 20వ సారి గర్భం దాల్చిందని తెలిసి వైద్యులే నోరెళ్లబెట్టారు. అయితే ఇదివరకు జరిగిన ప్రసవాలు అన్నీ .. ఇంటి వద్దే జరగడంతో ప్రపంచానికి ఆమె గత ప్రసవాల గురించి తెలియలేదు. తొలిసారి సీజేరియన్‌కు సిద్ధమవడంతో ... వార్తల్లో నిలిచారు.

లారీ డ్రైవర్లకు డ్రెస్ కోడ్ .. ఉల్లంఘిస్తే భారీ జరిమానా ... వాళ్లకు పెద్ద కష్టమేలారీ డ్రైవర్లకు డ్రెస్ కోడ్ .. ఉల్లంఘిస్తే భారీ జరిమానా ... వాళ్లకు పెద్ద కష్టమే

20వ సారి గర్భం ..

20వ సారి గర్భం ..

మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మజల్‌గావ్ మండలం కేశపురికి చెందిన మహిళ 20వ సారి గర్భం దాల్చింది. గోపాల్ కులానికి చెందిన 38 ఏళ్ల లంకాబాయి ఖరత్ ... మరోసారి గర్భం దాల్చింది. ఇరవై సార్లు గర్భం దాల్చినా ఇదివరకు జరిగినా ప్రసవాలు ఇంట్లోనే జరిగాయి. అందుకే ఇన్నీ సార్లు గర్భం దాల్చినా ఆ విషయం ప్రపంచానికి తెలియలేదు. ఇప్పటివరకు 16 సార్లు ప్రసవం జరిగింది. ప్రతి ప్రసవంలో ఒక్కో చిన్నారి జన్మించారు. అయితే ఐదుగురు శిశువులు పుట్టిన కొన్ని గంటలకే చనిపోయారు. దీంతో ఆమెకు 11 మంది పిల్లలు ఉన్నారు. మరో మూడు సార్లు మూడునెలల గర్భం దాల్చిన సమయంలో గర్భస్రావం అయ్యింది.

తల్లీ, బిడ్డ ఓకే ..

తల్లీ, బిడ్డ ఓకే ..

ఇప్పుడు తాజాగా మరోసారి ప్రెగ్నెంట్ అయ్యారు. లంకాబాయి గురించి తెలిసి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. సివిల్ ఆస్పత్రిలో అన్నీ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు తల్లీ, గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఆమెకు మందులు ఇచ్చామని చెప్పారు. లంబాబాయి ప్రస్తుతం 7 నెలల గర్భవతి అని వైద్యులు తెలిపారు. ఎప్పటిలాగానే 9 నెలలో సిజేరియన్ చేస్తామని .. ఒకవేళ ఇబ్బందులు ఉంటే ముందే ఆపరేషన్ నిర్వహిస్తామని చెప్పారు.

సిజేరియన్ సులువేనా ?

సిజేరియన్ సులువేనా ?

లంబాబాయి ప్రసవం సావ్యంగా జరుగుతుందా ? ఆమెకు భవిష్యత్‌లో ఆరోగ్య సమస్యలు వస్తాయా అనే ప్రశ్న తలెత్తుతుంది. శరీరంలో పిండం పెరిగే అవయవం గర్భాశయం కండరం వంటిదని వైద్యులు వివరించారు. ప్రసవం జరిగిన ప్రతిసారీ ఆ కండరం సాగిపోతుందుని చెప్తున్నారు. ఎక్కువసార్లు ప్రెగ్నెంట్ అయిన మహిళల్లో ప్లసెంటా వేరుపడిన తర్వాత గర్భాశయం సంకోచించడం కష్టమవుతుందని పేర్కొన్నారు. వరుస ప్రసవాల వల్ల గర్భ సంచి బలహీనపడటమే కాక అధికస్థాయిలో రక్తంపోయే ముప్పు ఏర్పడుతుందన్నారు. దీనికితోడు ఇదివరకు జరిగిన అబార్షన్లకు సంబంధించి గర్భాశయంలో ఉండిపోయే స్కార్ కణజాలం ప్లసెంటాకు సమస్యలు సృష్టిస్తోందని వివరిస్తున్నారు. దీనికితోడు నెలలు నిండకుండానే ప్రసవమయ్యే సమస్య కూడా పొంచి ఉందని వైద్యులు వెల్లడించారు.

English summary
A woman belonging to Keshapuri has been pregnant for the 20th time by the Majalgaon Mandal of Beed district in Maharashtra. The 38-year-old Lankabai Kharath from Gopal caste ... has once again pregnant. Twenty times she has pregnant and so far, child birth has taken place at home. That is why the world did not know that she pregnant all these times.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X