జాతి మొత్తం మీ వెనకే ఉంది.. ఇస్రో శాస్త్రవేత్తలకు రాహుల్ గాంధీ భరోసా, కొనియాడిన కాంగ్రెస్
Recommended Video
న్యూఢిల్లీ : మరికొద్ది సెకన్లలో చంద్రుడి ఉపరితలాన్ని విక్రమ్ ల్యాండర్ ముద్దాడే సమయంలో తలెత్తిన సాంకేతిక లోపంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ప్రయోగం సక్సెస్ కాలేదనే అంశం వారిని మొహల్లో స్పష్టంగా తెలుస్తోంది. బెంగళూరు ఇస్రో కేంద్రంలో ప్రధాని మోడీ ప్రయోగాన్ని విద్యార్థులతో కలిసి పరిశీలించారు. తర్వాత ఇస్రో చైర్మన్ శివన్ భావోద్వేగానికి గురవడంతో .. హత్తుకొని ఓదార్చారు. మీ సేవలను చూసి జాతి గర్విస్తోందని .. ఈ ప్రయోగం బ్రేక్ మాత్రమేనని .. ఇప్పటికే విజయాలు సాధించారని ... మరిన్ని విజయాలు సాధిస్తారని ఓదార్పునిచ్చారు. తర్వాత కాంగ్రెస్ నేత రాహుల్ కూడా శాస్త్రవేత్తలకు ధైర్యం కల్పించారు.
ఇస్రో ఛైర్మన్ శివన్ కన్నీరు..ప్రధాని ఓదార్పు: భుజం..వెన్ను తట్టి :నెటిజెన్ల ప్రశంసలు ..!!
'చంద్రయాన్ -2 కోసం మీరు అహోరాత్రులు శ్రమించారు. అంకితభావంతో కలిసి సమిష్టిగా పనిచేశారు. కానీ చివరి క్షణంలో విక్రమ్ ల్యాండర్తో సంబంధాలు తెగిపోవడం బాధాకరం. చంద్రయాన్ -2 కోసం మీరు చేసిన పని మిగతా దేశంలోని ప్రతి ఒక్కరికీ ప్రేరణ కలిగిస్తోంది. చంద్రయాన్-2 కోసం మీరు చేసిన పని మాత్రమే ఫలించలేదు. కానీ ఇప్పటివరకు మీరు సాధించిన విజయాలు కళ్లముందు కదలాడుతున్నాయి' అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
మరోవైపు 'కాంగ్రెస్ పార్టీ కూడా ఇస్రో శాస్త్రవేత్తల కృషిని అభినందించింది. చంద్రయాన్-2 కోసం మీరు చేసిన పనిని జాతి యావత్ గమనించిందని .. ఈ క్లిష్ట సమయంలో జాతి యావత్ మొత్తం మీ వెనక ఉంటుందని స్పస్టంచేసింది. చంద్రయాన్-2 కోసం మీరు కృతనిశ్చయంతో చేసిన పనిని చూసి జాతి యావత్ గర్వపడుతుంది' అని ట్వీట్లో కాంగ్రెస్ పార్టీ కూడా పేర్కొంది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడుకి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు సిగ్నల్స్ పోయిన సంగతి తెలసిందే.