ప్రపంచంలోనే అత్యంత పోట్టి మహిళ... యోగా చేస్తుంది....ఎలా...?
జూన్ 21న యోగా డే సంధర్బంగా ప్రపంచ వ్యాప్తంగా యోగాను నిర్వహించేందుకు పలు దేశాలతోపాటు ఆయా సంస్థలు, వ్యక్తులతోపాటు పలువురు సెలబ్రెటీలు సైతం యోగా ఉత్సవాల్లో పాల్గోనేందుకు సిద్దమవుతున్నారు. ఈనేపథ్యంలోనే ఎవరి స్థాయిలో యోగా డేను విజయవంతం చేసేందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు.. యోగాను ప్రపంచస్థాయిలో మరింత ప్రాచూర్యం తీసుకువచ్చేందుకు కొద్దిమంది అత్యంత ఎత్తైన ప్రాంతంలో యోగా చేస్తుంటే ,కొంతమంది మంచు పర్వాతాల్లో యోగాను నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇక యోగా కోసం ప్రధాని మోడీ ఓ అనిమేటేడ్ వీడీయోను కూడ విడుదల చేశారు. యోగా వల్ల కలిగే ఉపయోగాలు, వాటి ఆసనాలు వేస్తూ వివరించారు.
ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోనే పోట్టి మహిళ అయిన జ్యోతి ఆమ్నే సైతం యోగా డేలో పాల్గోనేందుకు సిద్దమవుతున్నారు. ఇందుకోసం ఆమే నాగాపూర్లో నిర్వహించిన యోగాలో ప్రాక్టీస్లో పాల్గోన్నారు. ఈ సంధర్బంగా యోగా డేలో పాల్గోనేందుకు ప్రాక్టిస్ చే్స్తున్నట్టు ఆమే తెలిపారు.
ఇక జ్యోతి ఆమ్నే డిశంబర్ 16, 1993లో జన్మించింది.కాగా జ్యోతి 2 ఫీట్ల 1 ఇంచు పోడవు ఉండగా సుమారు 5కిలోల బరువు మాత్రమే ఉంటుంది.