వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆల్‌పార్టీ మీటింగ్‌కు ఎందుకు రాలేదంటే .. మాయావతి చెప్పిన కారణమిదీ ?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు అన్ని పార్టీల నేతలను ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించారు. ఈ సమావేశానికి బీఎస్పీ చీఫ్ మాయావతి కూడా హాజరుకాలేదు. పైగా తాను ఎందుకు రాలేనో సవివరంగా ఎక్స్‌ప్లేన్ చేశారు మాయావతి. తాను సమావేశానికి వస్తే సమస్యలను వదిలి చర్చ పక్కదారి పడుతుందని పేర్కొన్నారు.

జమిలీ ఎన్నికల అంశం కూడా ...
వాస్తవానికి మోడీ కీలక అంశాలతోపాటు ఓకే దేశం, ఓకే ఎన్నికలు నిర్వహణపై చర్చిద్దామని ఆహ్వానించారు. ఈ ఏడాది జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి, అలాగే 2022లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నందున కీలక అంశాలపై ప్రతిపక్షాల అభిప్రాయాలను తీసుకోవాలని అఖిలపక్ష సమావేశానికి పిలిచారు. కానీ కొందరు నేతలు మాత్రం సమావేశానికి హాజరుకాలేదు. తాను ఎందుకు హాజరుకాలేదో మాయావతి వివరణ ఇచ్చారు. ఈవీఎంల చర్చ జరుగుతుందని .. దీంతో దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్య పేదరికంపై సవ్యంగా డిస్కషన్ జరుగదని పేర్కొన్నారు. బ్యాలెట్ పేపర్ స్థానంలో ఈవీఎం తీసుకురావడం చారిత్రక తప్పిదమని మాయావతి అభిప్రాయపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని పేర్కొన్నారు.

‘Would’ve attended if it was on EVMs’: Mayawati to skip PM meet

Recommended Video

నీతి ఆయోగ్ కు హాజరు కానున్న కేసీఆర్..

సాఫీగా ..
ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియకు ఎన్నడూ ఆటంకాలు కలుగొద్దు. అలా జరిగితే విలువలకు తిలోదకాలు ఇచ్చినట్టు అవుతుందన్నారు మాయావతి. అలాగే ఓకే దేశం ఓకే ఎన్నిక తో కూడా అంతగా ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. దీంతో సమస్యలు పక్కదారి పట్టే అవకాశం ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదరికం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓకే దేశం ఓకే ఎన్నిక అనేది బీజేపీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో అని .. దానిని అమలు చేయాలని ఎలా చూస్తారాని మాయావతి ప్రశ్నించారు. దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణపై గతేడాది న్యాయశాఖ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఓకే దేశం ఓకే ఎన్నిక అనే అంశం తెరపైకి వచ్చింది.

English summary
BSP chief Mayawati on Wednesday said she would have attended the all-party meeting called by the prime minister if it was on EVMs, and described the idea of simultaneous Lok Sabha and assembly polls as a ploy to divert attention from issues like poverty. Mayawati’s comments came hours before an all-party meeting called by Prime Minister Narendra Modi to discuss several issues, including the idea of “one nation, one election”, celebration of 150 years of Mahatma Gandhi’s birth anniversary this year and 75 years of Independence in 2022. The BSP chief alleged that the people’s faith in the electronic voting machines (EVMs) had dwindled to worrisome level.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X