వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతులు ఇళ్ల దగ్గరే చావొచ్చుగా, ఉద్యమాలెందుకు? -బీజేపీ మంత్రి దలాల్ దివాళాకోరు కామెంట్లు -యూటర్న్

|
Google Oneindia TeluguNews

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లో వేలాది మంది రైతులు చేస్తోన్న నిరసనలు ఆదివారం నాటికి 81వ రోజులు పూర్తయ్యాయి. రిపబ్లిక్ డే నాటి హింస తర్వాత రైతులు, కేంద్రం మధ్య చర్చల ప్రక్రియ కూడా నిలిచిపోయింది. ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేయడానికి రైతులు ప్రయత్నిస్తుండగా, దాన్ని అడ్డుకునేందుకు సర్కారు తీవ్రంగా శ్రమిస్తోంది. రైతులను ఉద్దేశించి టెర్రరిస్టులు, ఖలీస్తానీ విభజనకారులంటూ బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్న క్రమంలో ఆ పార్టీకి చెందిన మంత్రి ఒకరు చనిపోయిన రైతులపైనా సంకుచిత వ్యాఖ్యలు చేశారు..

సొంత ఊళ్లో వైసీపీ ఓటమిపై మంత్రి కొడాలి నాని అనూహ్య స్పందన -హైకోర్టు కీలక ఆదేశాలుసొంత ఊళ్లో వైసీపీ ఓటమిపై మంత్రి కొడాలి నాని అనూహ్య స్పందన -హైకోర్టు కీలక ఆదేశాలు

గడిచిన మూడు నెలలుగా కొనసాగుతోన్న ఉద్యమంలో కనీసం 200 మంది రైతులు వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోవడం, వారిని అమరులుగా గుర్తించాలని రైతు సంఘాలు, విపక్షాలు డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి జేపీ దలాల్ రైతుల మరణాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ''రైతులు ఆందోళన చేస్తున్నందుకే చస్తున్నారా ? ఏం? వాళ్లంతా ఇళ్లలోనే ఉండుంటే చావకపోయేవారా? ఆందోళనలో పాల్గొంటున్న రెండు లక్షల మంది ఇప్పటికీ ఇళ్లలోనే ఉండుంటే వారిలో కనీసం 200 మందైనా చచ్చేవాళ్లు కాదా?'' అని మంత్రి దలాల్ అన్నారు. దీనిపై..

 Wouldnt they die at home: BJP minister Minister JP Dalal apologises after backlash

బీజేపీ మంత్రి దలాల్ వ్యాఖ్యలు దివాళకోరుతనాన్ని సూచిస్తున్నాయని విపక్ష కాంగ్రెస్ మండిపడింది. దలాల్ రాజీనామాను డిమాండ్ చేస్తూ హర్యానా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేసింది. తాప్సీ పన్ను, రిచా చడ్డా లాంటి బాలీవుడ్ ప్రముఖులు సైతం మంత్రి కామెంట్లను ఖండించారు. సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మంత్రి దలాల్ యూటర్న్ తీసుకున్నారు...

వైఎస్ షర్మిలకు సీఎం సీటు ఆఫర్ -వైసీపీ ఎంపీ సాయిరెడ్డికి వార్నింగ్ -తాజాగా మరో సంచలనంవైఎస్ షర్మిలకు సీఎం సీటు ఆఫర్ -వైసీపీ ఎంపీ సాయిరెడ్డికి వార్నింగ్ -తాజాగా మరో సంచలనం

Recommended Video

#TOPNEWS: FASTag | LPG Price Hike- To Cost ₹ 50 More| AP Municipal Elections

తన మాటలను మీడియా వక్రీకరించిదని హర్యానా మంత్రి దలాల్ చెప్పుకొచ్చారు. ఆదివారం మరోసారి స్పందించిన ఆయన.. తాను ఒకటి మాట్లాడితే, మీడిమా మరోలా ప్రసారం చేసిందని సెలవిచ్చారు. ఏదిఏమైనా తాను ఎప్పటికీ రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంటానని, తన మాటలతో ఎవరైనా బాధ పడితే క్షమించాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు. ఈ ప్రకటన వెలువడిన తర్వాత మంత్రి వ్యాఖ్యల వీడియో మళ్లీ వైరలైంది.

English summary
Haryana Agriculture Minister JP Dalal on Sunday apologised for his "they would have died even at home" statement on the deaths of farmers at various protest sites after the minister faced backlash on social media for his remarks. JP Dalal also said it is painful if anyone dies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X