వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదృశ్యమైన సుఖోయ్ 30 శకలాలు లభ్యం: పైలట్ల సమాచారం లేదు

మూడు రోజుల క్రితం గల్లంతైన ‘సుఖోయ్‌-30’ యుద్ధవిమానం శకలాలను గుర్తించారు. చైనా సరిహద్దులోని అడవుల్లో సుఖోయ్‌ 30 శకలాలు లభించినట్లు అధికారులు వెల్లడించారు. పైలట్ల సమాచారం మాత్రం అందలేదు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మూడు రోజుల క్రితం గల్లంతైన 'సుఖోయ్‌-30' యుద్ధవిమానం శకలాలను గుర్తించారు. చైనా సరిహద్దులోని అడవుల్లో సుఖోయ్‌ 30 శకలాలు లభించినట్లు అధికారులు వెల్లడించారు. పైలట్ల సమాచారం మాత్రం అందలేదని తెలిపారు.

Wreckage of missing Sukhoi- 30 found; No info on pilots

విమానం గల్లంతైన అసోంలోని తేజ్‌పూర్‌కు 60కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో సుఖోయ్‌ కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని చెప్పారు. భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్‌-30 గత మంగళవారం అసోంలో గల్లంతైన విషయం తెలిసిందే.

సాధారణ శిక్షణలో భాగంగా ఇద్దరు పైలట్లతో తేజ్‌పూర్‌ వైమానిక స్థావరం నుంచి బయల్దేరిన విమానం కాసేపటికి కన్పించకుండా పోయింది. మంగళవారం ఉదయం 11.10 గంటల సమయంలో విమానానికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు తెలిపారు.

English summary
The Indian Air Force's missing Sukhoi-30 MKI's wreckage found close to the last known position of the aircraft on Friday morning, but there is no information on the two pilots.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X