‘హార్వర్డ్ ప్రసంగం’: లాలూ కూతురిపై కేసు నమోదు
ముజఫర్నగర్: లాలూ ప్రసాద్ యాదవ్ కూతురిపై కేసు చీటింగ్, నమ్మకదోహ్రానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై కేసు నమోదు చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీలో కీలక వక్తగా ప్రసంగించానంటూ మార్చి 7న సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
మీసాభారతీ చేసిన ప్రకటనను హార్వర్డ్ యూనివర్సిటీ ఇటీవల ఖండించింది. ఈ వ్యవహారంలో ఐపీసీ సెక్షన్ 323, 406, 420, 465, 468, 471 కింద కేసు నమోదు చేశారు.
చేతనైతే నాపై ఉన్మాది కేసు పెట్టండి
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ ఓ బ్రిటీష్ ఏజెంట్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ, దేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటును కూడా సవాలు చేశారు. కట్జూ వ్యాఖ్యలను ఖండిస్తూ రాజ్యసభ గతంలోనే తీర్మానం చేయగా లోక్సభ కూడా గురువారం ఖండన తీర్మానం ఆమోదించింది. దీనిపై స్పందిస్తూ చేతనైతే తనపై ఉన్మాదిగా కేసు పెట్టాలని కట్జూ లోక్సభకు శుక్రవారం సవాలు విసిరారు.
‘నాపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని ఒక గౌరవనీయుడైన సభ్యుడు సూచించారు. కానీ, ఐపీసీలోని ఏ సెక్షన్ కింద కేసు పెడతారు? కచ్చితంగా సభ నన్ను అదుపుచేయాల్సిందిగా ఆదేశాలివ్వలేదు. ఈ విషయంలో గౌరవ సభ్యులు తల గోక్కుంటారని నాకు అనిపిస్తోంది. నా నేరాన్ని నిరూపించేందుకు పీనల్కోడ్ పేజీలు తిప్పేయాలి. మీకో ఉత్తమ సలహా ఇవ్వనా? ఉన్మాద చట్టమని ఒకటుంది. అది నాకు సరిగ్గా సరిపోతుంది' కట్జూ అని పేర్కొన్నారు.