బంఫర్ ఆఫర్: రెడ్ మీ 4ఎ ఫోన్ కొంటే 28 జీబీ డేటా ఫ్రీ
కంపెనీ షియోమి భారత్ లో రెడ్ మీ 4 ఏ లాంచ్ చేసింది. అయితే ఈ ఫోన్ ను కోనుగోలుచేసిన వారికి 28 జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది.
న్యూఢిల్లీ:చైనీస్ కంపెనీ షియోమి భారత్ లో రెడ్ మీ 4 ఏ లాంచ్ చేసింది. అయితే ఈ ఫోన్ ను కోనుగోలుచేసిన వారికి 28 జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది.
మి.కామ్, అమెజాన్ లలో ఈ పోన్ ను కంపెనీ ఆవిష్కరించింది. రెండ్ మీ 4 ఏ అధికారికంగా లాంచ్ చేసింది.రెడ్ మీ 4 ఏ ను అధికారికంగా లాంచ్ చేసిన ఐడియా కస్టమర్ల కోసం కంపెనీ ఈ లాంచ్ ఆఫర్లను ప్రకటించింది.
అయితే ఈ పోన్ ను కొనుగోలు చేసి రూ.343 లతో రీచార్జ్ చేసుకొంటే 28 జీబీని పొందుతారని ఆ కంపెనీ ప్రకటించింది. మరో వైపు ఈ ఆఫర్లన్నీ కూడ అమెజాన్ ఇండియాలో కొనుగోలు చేసిన వారికే వర్తిస్తాయి.
అమెజాన్ ఇండియాలో రెడ్ మీ4 ఎను కొనుగోలు చేసిన ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లకు 28జీబీ 4జీ డేటాను రూ.343 ప్యాక్ తో అందించనున్నట్టు కంపెనీ ప్రకటించింది.
ఈ ప్యాక్ కింద రోజుకు 1 జీబీ డేటా వాడుకోవచ్చని తెలిపింది. దాంతో పాటుగా రెడ్ మీ 4 ఏ కస్టమర్లు రోజుకు 300 నిమిషాల ఉచిత కాల్సా నెలకు మూడు వేల లోకల్, ఎస్ టి డి , ఎస్ ఎంఎస్ లను పొందుపర్చనున్నారు షియోమి వెల్లడించింది.
ఈ రీచార్జ్ ప్యాక్ కేవలం 28 రోజుల వరకే ఉంటుంది. 28 రోజుల తర్వాత కూడ రూ.343 ప్యాక్ తో రీచార్జ్ చేసుకొంటే ఈ ఆఫర్లను పొందే అవకాశం ఉంది. 2017 జూన్ 30 తర్వాత ఈ ప్యాక్ గడువు ముగుస్తోంది.రెడ్ మీ 4 ఏ గురువారం నుండి మి.కామ్, అమెజాన్ ఇండియాలో విక్రయానికి రానుంది. ఈ ఫోన్ ధర రూ.5999 ఆఫ్ లైన్ ద్వారా అందుబాటులో ఉండదు. మి.కామ్ లోకొనుగోలు చేసిన కస్టమర్లకు ఎలాంటి ఆఫర్లను కంపెనీ ప్రకటించలేదు.