యాసిన్ భత్కల్కు అక్టోబర్ 17 వరకు రిమాండ్
కోర్టులో
భత్కల్ను
న్యాయమూర్తి
పలు
ప్రశ్నలు
అడిగినట్లు
సమాచారం.
తన
పేరు,
నివాసం
ఎక్కడని
అడగ్గా..తన
పేరు
యాసిన్
భత్కల్
అని,
కర్నాటకలోని
భత్కల్కు
చెందినవాడినని
యాసిన్
తెలిపాడు.
భత్కల్ను
కస్టడీకి
ఇవ్వాల్సిందిగా
ఎన్ఐఏ
అధికారులు
పిటిషన్
దాఖలు
చేశారు.
దీనిపై
విచారణ
జరిపిన
కోర్టు
సోమవారం
సాయంత్రానికి
వాయిదా
వేసింది.
ఒక
వేళ
భత్కల్ను
కస్టడీకి
ఇస్తే
చంచల్గూడ
జైలుకు
తరలించే
అవకాశం
ఉంది.
కాగా
ఎన్ఐఏ
అధికారులు
భత్కల్ను
ఓ
రహస్య
ప్రదేశంలో
విచారణ
జరిపి
కీలక
సమాచారాన్ని
రాబట్టినట్లు
సమాచారం.
సెప్టెంబర్ 21న ఢిల్లీ కోర్టు రెండ్రోజుల ట్రాన్సిట్ రిమాండ్ మంజూరు చేయడంతో హైదరాబాద్ ఎన్ఐఏ విభాగం అధికారులు ఆదివారం భత్కల్ను హైదరాబాద్కు తీసుకొచ్చారు. దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో యాసిన్ భత్కల్ను ఐదో నిందితుడిగా పేర్కొనడం జరిగింది.
ఇటీవల భారత్-నేపాల్ దేశాల సరిహద్దులో ఎన్ఐఏ అరెస్టు చేసిన అసదుల్లా అక్తర్కు భత్కల్ సంబంధాలున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 19 స్థానిక కోర్టు 15 రోజుల కస్టడీకి అనుమతివ్వడంతో ఎన్ఐఏ అధికారులు అసదుల్లాను విచారిస్తున్నారు.