Illegal affair: అల్లుడితో కూతురు, ప్రియుడితో తల్లి కాపురం, రెండో పెళ్లి అని డ్యాన్స్ చేసిన ఆంటీ!
చెన్నై/ వేలూరు: ఒకేచోట ప చేస్తున్న సమయంలో ఆంటీతో రాసుకునిపూసుకుని తిరుగుతున్న అతనికి ఆమె అందానికి పచ్చిపట్టిపోయింది. ఆంటీని ఎలాగైనా వలలో వేసుకోవాలని ఆ వ్యక్తి అనేక ప్రయత్నాలు చేశాడు. అదే సమయంలో ఆంటీ భర్త చనిపోయాడని తెలుసుకున్న వ్యక్తి ఎట్టకేలకు ఆమెను లొంగదీసుకున్నాడు. కూతురికి పెళ్లి అయిపోయి అల్లుడితో కాపురం చేసుకుంటోంది.
ఈ దెబ్బతో అడిగేదిక్కు లేకపోవడంతో అతనితో ఆంటీ పిచ్చపాటిగా జల్సా చేసింది. తనను రెండో పెళ్లి చేసుకోవాలని ఆంటీ ప్రియుడితో డ్యాన్స్ చేసింది. అంతే గుహలోకి ప్రియుడు ఆంటీని పిలుచుకుని వెళ్లాడు. అంతే ఆంటీ గుహలో నుంచి ప్రాణాలతో బయటకు రాకపోవడం కలకలం రేపింది.
Girlfriend: మేడమ్ కు భర్త, సార్ కు భార్య లేరు, రాత్రి ఎంజాయ్ చేసి ఇనుపరాడ్ తో, అప్పుడు లేని భయం!
రాజులు నిర్మించిన పెద్ద గుహ
ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దులోని వేలూరు జిల్లా, అనకట్ట సమీపంలోని వల్లిమలై కొండ మీద రాజుల కాలంలో నిర్మించిన సమనార్ అనే గుహలో సుమారు 55 ఏళ్ల మహిళ శవం కుళ్లిపోయిన స్థితిలో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలంలో కొన్ని ఆనవాళ్లు సేకరించిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. గుహలో మహిళ హత్యకు గురైన విషయం వేలూరు జిల్లాలో కలకలం రేపింది. ఎవరిది ఈ శవం ? అంటూ చాలా గందరగోళానికి దారితీసింది. హత్యకు గురైయ్యింది ఆంధ్రా మహిళ ? తమిళనాడు మహిళ ? అనే విషయం మొదట అంతుచిక్కలేదు. కొన్ని రోజుల నుంచి ఈ కేసు విచారణలో ఉంది.
కూతురి పెళ్లి అయిపోయింది
వేలూరు జిల్లాలోని ఆనకట్టు ప్రాంతం సమీపంలోని కిలకోటూరు ప్రాంతంలో నివాసం ఉంటున్న అన్బు (42) అనే వ్యక్తి మంచి రసికుడు అని స్థానికులు అంటుంటారు. పరాయి స్త్రీల మీద అన్బుకు చాలా వ్యామోహం ఉందని తెలిసింది. ఇతనికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది. అన్బు కుమార్తెకు ఇటీవలే వివాహం అయ్యింది. వేలూరు నగరం సమీపంలోనే కరుగంబధూరు ప్రాంతంలో నివాసం ఉంటున్న వత్సల (55) అనే మహిళ భర్త చనిపోయాడు. వత్సల ఒక్కగాన ఒక్క కుమార్తెకు రెండు సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. వత్సల కుమార్తె ఆమె భర్తతో కలిసి ఉంటున్నది.
పిటపిటలాడే ఆంటీని చూసి వల ?
వత్సల ఆంటీ ఒంటరిగా ఉంటూ కాలం గడుపుతోంది. వత్సల, అన్బు ఒకే చోట పని చేస్తుండటంతో వారికి ఇంతకు ముందే పరిచయం ఉంది.వత్సల ఆంటీ భర్త చనిపోయాడని అన్బుకు తెలిసింది. అందంగా నాటుకోడిలా పిటపిటలాడుతున్న వత్సల ఆంటీని ఎలాగైనా అనుభవించాలని రగిలిపోతున్న అన్బు ఆమెతో రాసుకుంటూ పూసుకుంటూ తిరిగేవాడు. భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న వత్సల ఆంటీలో కామకోరికలు పుట్టేలా చేసిన అన్బు చివరికి ఆమెను వలలో వేసుకున్నాడు.
ఎంజాయ్ కోసం వెళ్లి వత్సలా మాయం
ఆంటీ కూతురికి పెళ్లి అయిపోవడం, ఆమె భర్తతో కలిసి వేరే ప్రాంతంలో నివాసం ఉండటంతో వత్సల ఎప్పుడుపడితే అప్పుడు ప్రియుడు అన్బుతో కలిసి బయటకు వెళ్లి ఎంజాయ్ చేస్తోంది. వత్సల, అన్బల అక్రమ సంబంధం చెయ్యిదాటిపోయింది. మూడు నెలల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వత్సల తరువాత ఇంటికి తిరిగిరాలేదు. రెండు రోజుల వత్సల కోసం వేచి చూచిన ఆమె బంధువులు చివరికి వేలూరు నార్త్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వత్సల కనపడటం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేశారు.
దేనికోసం ఎవరితో వెళ్లింది?
గుహలో మహిళ హత్యకు గురైన విషయం వేలూరు జిల్లాలో కలకలం రేపింది. ఎవరిది ఈ శవం ? అంటూ చాలా గందరగోళానికి దారితీసింది. హత్యకు గురైయ్యింది ఎవరు ? అనే విషయం మొదట అంతుచిక్కలేదు. తరువాత సంఘటనా స్థలంలో చిక్కిన ఆధారాలను వత్సల బంధువులకు చూపించారు .అవును ఈ వస్తువులు వత్సలవే అని ఆమె బంధువులు పోలీసులకు చెప్పారు. వత్సల హత్యకు గురైయ్యిందని పోలీసులు నిర్దారించుకున్నారు.
ఈ వయసులో రెండో పెళ్లి అవసరమా ? స్టోరీ చెప్పాడు
వత్సల మొబైల్ ఫోన్ లోని డేటా పరిశీలించిన పోలీసులు అన్బును అదుపులోకి తీసుకున్నారు. తనకు వత్సలకు సంవత్సరం నుంచి అక్రమ సంబంధం ఉందని అన్బు అంగీకరించాడు. ఈనెల 7వ తేదీన వత్సలను నమ్మించి తాను వల్లిమలై కొండ మీద గుహలోకి తీసుకెళ్లానని అన్బు పోలీసులకు చెప్పాడు. ప్రతినిత్యం తనకు డబ్బులు ఇవ్వాలని, రెండో పెళ్లి చేసుకోవాలని వత్సల తనను పీడించిందని, ఆమె టార్చర్ ఎక్కువ కావడంతో పక్కాప్లాన్ తో గుహలోకి తీసుకెళ్లి చంపేశానని అన్బు అంగీకరించాడు. నమ్మి వెళ్లిన వ్యక్తి తల్లి వత్సలాను చంపేయడంతో అన్బును ఉరి తియ్యాలని ఆమె కుమార్తె ఇప్పుడు న్యాయవాదుల సహకారంతో కోర్టుల చుట్టూ తిరుగుతోంది.