వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Engineer: సెకండ్ హ్యాండ్ బైక్, కారు ఓకే, పిల్లల తల్లితో పెళ్లి ఏందిరా రాస్కెల్, పట్టుకోస్తే మళ్లీ పారిపోయింది

|
Google Oneindia TeluguNews

చెన్నై/ తిరునల్వేలి: ఇంజనీరుగా మంచి ఉద్యోగం చేస్తున్నావ్, నువ్వు కోరుకుంటే కోటి రూపాయలు కట్నం ఇచ్చేవాళ్లు ఉన్నారు, అలాంటి బిడ్డల తల్లితో నీకు ప్రేమ, పెళ్లి పేటాకులు అంటావు ఏందిరా అంటూ అందరూ చివాట్లు పెట్టారు. ప్రియురాలిని మరిచిపోలేక ఇంజనీరు ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడంతో నువ్వులేక నేనులేను అంటూ ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె ఐదు ఏళ్ల కుమారుడు నడిరోడ్డున పడ్డాడు. తల్లిని భర్త వదిలేయడం, ఆమె వేరే వ్యక్తితో అక్రమ సంబంధం సాగించడంతో కుటుంబ సభ్యులు వారిని దూరం పెట్టారు. ప్రియుడు, ప్రియురాలు ఆత్మహత్య చేసుకోవడంతో బిడ్డను చూసుకోవడానికి అన్ని వైపుల వారు నిరాకరించడంతో పాపం ఆ బాలుడు ఈ రోజు దిక్కులేని వాడైనాడు.

young girl: బావకు బాబాయ్ కి తేడా లేదా ?, అక్రమ సంబంధం, టైమ్ చూసి నగ్న వీడియోలు షేర్, వైరల్ !young girl: బావకు బాబాయ్ కి తేడా లేదా ?, అక్రమ సంబంధం, టైమ్ చూసి నగ్న వీడియోలు షేర్, వైరల్ !

 మొగుడు- పెళ్లాం ఢిష్యూం ఢిష్యూం

మొగుడు- పెళ్లాం ఢిష్యూం ఢిష్యూం

తమిళనాడులోని తిరునల్వేలి సమీపంలోని నెలెల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూలకరైపట్టికి చెందిన మురుగన్ కుమార్తె కర్పగం (27), సెల్వంల వివాహం 7 సంవత్సరాల క్రితం జరిగింది. కర్పగం, సెల్వ దంపతులకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు రావడంతో రెండు సంవత్సరాల క్రితం సెల్వ భార్య కర్పగంను వదిలేశాడు. అప్పటి నుంచి కుమారుడితో కలిసి కర్పగం వేరుగా ఒంటరిగా నివాసం ఉంటోంది.

 మంచి జీతం..... ఇంజనీరు ప్రియుడు

మంచి జీతం..... ఇంజనీరు ప్రియుడు

కర్పగం పని చేస్తున్న కంపెనీలో తిరువళ్ళూర్ నగర్ నివాసి మహారాజన్ (26) ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. మహారాజన్ మంచి ఉద్యోగం చేస్తూ లక్ష రూపాయలకు పైగా జీతం సంపాధిస్తున్నాడు. కంపెనీ ఉద్యోగి మహారాజన్ తో కర్పగం పరిచయం పెంచుకుంది. మహారాజన్, కర్పగం పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. గత సంవత్సరం నుంచి ఇద్దరు తిరువూర్ లో అద్దె ఇంటిలో నివాసం ఉంటూ కాపురం చేస్తున్నారు.

 పోలీసులు పట్టుకొస్తే మళ్లీ జెండా ఏత్తేసింది

పోలీసులు పట్టుకొస్తే మళ్లీ జెండా ఏత్తేసింది

కర్పగం భర్తను వదిలేసి అద్దె ఇంటిని ఖాళీ చేసి కుమారుడితో కలిసి మాయం కావడంతో ఆమె తండ్రి మురుగన్ తన కుమార్తె కనపడటం లేదని పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలించి కర్పగంను గుర్తించి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించినా కర్పగం మాత్రం నెల రోజులు కూడా అక్కడ ఉండలేదు. మళ్లీ ప్రియుడు మహారాజన్ తో కలిసి పారిపోయింది. తరువాత పాళయంకోటైలో మహారాజన్, కర్పగం కాపురం పెట్టారు.

 పెళ్లి చేసుకుందాం రా డియర్

పెళ్లి చేసుకుందాం రా డియర్

కర్పగంతో పాటు ఆమె కుమారుడు అక్కడే ఉన్నాడు. ఇక లాభం లేదని కర్పగం తల్లిదండ్రులు ఆమెను వదిలేశారు. తనను సాంప్రధాయ పద్దతిలో వివాహం చేసుకోవాలని, అందరిలాగా మనం దంపతులుగా సమాజంలో జీవించాలని కర్పగం ప్రియుడు మహారాజన్ మీద ఒత్తిడి చేసింది. కర్పగంను పెళ్లి చేసుకోవాలని మహారాజన్ డిసైడ్ అయ్యాడు.

 పిల్లల తల్లితో పెళ్లి ఏందిరా రాస్కెల్

పిల్లల తల్లితో పెళ్లి ఏందిరా రాస్కెల్

తాను కర్పగంను పెళ్లి చేసుకుంటానని మహారాజన్ అతన ఇంటిలో చెప్పాడు. ఇంజనీరుగా మంచి ఉద్యోగం చేస్తున్నావ్, లక్ష రూపాయలకు పైగా జీతం సంపాధిస్తున్న నువ్వు బిడ్డల తల్లిని పెళ్లి చేసుకుంటానంటే మేము అంగీకరించమని, మేము చెప్పిన అమ్మాయిని నువ్వు వివాహం చేసుకోవాలని మహారాజన్ కుటుంబ సభ్యులు తేల్చిచెప్పారు. తల్లిదండ్రులకు ఎంత చెప్పినా వారు మాత్రం వినలేదు.

 A to Z ఇంట్లో పెట్టి ఇంజనీరు ఆత్మహత్య

A to Z ఇంట్లో పెట్టి ఇంజనీరు ఆత్మహత్య

కర్పగంను వివాహం చేసుకోవడానికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఆమెతో కలిసి జీవించలేనని నిర్ణయించుకున్న మహారాజన్ తీవ్రమనస్థాపానికి గురైనాడు. ఏటీఎం కార్డు, సెల్ ఫోన్, పాన్ కార్డు ఇంటిలో పెట్టిన మహారాజన్ నేరుగా మలయాళమేడు రైల్వేగేట్ సమీపంలోకి వెళ్లి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన మహిళ కోసం మహారాజన్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

 ఈ జన్మకు ఇది చాలు రాజన్

ఈ జన్మకు ఇది చాలు రాజన్

ప్రియుడు మహారాజన్ విషయం తెలుసుకున్న కర్పగం తన ఐదు సంవత్సరాల బిడ్డను ఇంటిలో వదిలేసి ప్రియుడు మహారాజన్ ఎక్కడైతే ఆత్మహత్య చేసుకున్నాడో అదే ప్రాంతానికి వెళ్లి ఆమె రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. తల్లి కర్పగం, ఆమె ప్రియుడు మహారాజన్ ఆత్మహత్య చేసుకోవడంతో అనాథ అయిన ఐదేళ్ల కుమారుడిని పెంచిపోషించడానికి ఒక్కరూ ముందుకురాలేదు. పోలీసులు బిడ్డను ప్రభుత్వ చిన్నపిల్లల సంరక్షణా కేంద్రానికి తరలించారు.

English summary
Year Ender 2020: A 29- year- old woman and her paramour committed suicide near Tirunelveli in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X