Beauty parlour: మొగుడు మడతపెట్టలేదని ప్రియుడితో ఎంజాయ్, ఫ్రెండ్స్ తో కలిసి ఏం చేశాడంటే ?
చెన్నై/నమ్మక్కల్: ఇంట్లో ఉన్న మొగుడు సరిగా మడతపెట్టడం లేదని, తాను సుఖపడటం లేదని భావించిన భార్య హుషారుగా, చలాకిగా ఉన్న ప్రియుడికి వెతుక్కుని ఎంజాయ్ చేసింది. భార్యకు మంచిమొగుడు మధ్యలో అల్లరిప్రియుడు వచ్చేశాడు. అక్రమ సంబంధం కారణంగా ప్రియుడు ఫ్రెండ్స్ తో కలిసి వివాహిత మహిళను రేప్ చేసి దారుణంగా చంపేశాడు. వివాహం అయ్యి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న మహిళను హత్య చేసిన నిందితులు రోడ్డు పక్కన ఉన్న నీటి గుంతలో విసిరివేసి పరారైనారు. కుమారుడి బర్త్ డే ముందురోజు ఆ బ్యూటీ పార్లల్ మహిళ హత్యకు గురికావడం కలకలం రేపింది.
ఇద్దరు పిల్లల తల్లి
తమిళనాడులోని నమ్మక్కల్ జిల్లాలో శోభా, సెంథిల్ దంపతులు నివాసం ఉంటున్నారు. శోభన, సెంథిల్ దంపతులకు దేవా (11), సచిన్ (4) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. శోభనా బ్యూటీ పార్లల్ నిర్వహిస్తోంది. బ్యూటీపార్లల్ నిర్వహిస్తున్న శోభనా ప్రతిరోజు టిప్ టాప్ గా రెడీ అయ్యి తిరిగింది. సెంథిల్ ఆయన భార్య శోభనా, కుమారులు ఇద్దరిని సంతోషంగా చూసుకుంటున్నాడు.
హాయ్ మేడమ్..... నువ్వు కేక
శోభనా బ్యూటీ పార్లల్ నిర్వహిస్తోంది. భర్త సెంథిల్ కు తాను బ్యూటీ పార్లలల్ కు వెలుతున్నానని క్రమం తప్పకుండా శోభనా సమాచారం ఇచ్చేది. అదే సమయంలో శోభనాకు తిరుచెంగోడ్ ప్రాంతానికి చెందిన సురేష్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. శోభనా, సురేష్ పరిచయం కాస్త చనువుగా మారింది. హాయ్ మేడమ్ అంటూ సురేష్ శోభనాకు లైన్ వేశాడు.
దేవా బర్త్ డే
ఫ్రెండ్ గా పరిచయం అయిన సురేష్ కు శోభనా లొంగిపోయింది. ఎక్కడపడితే అక్కడికి ప్రియుడు సురేష్ తో వెళ్లిన శోభనా పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. కొడుకు దేవా పుట్టిన రోజుకు కొత్త దుస్తులు, చాక్లెట్ లు తీసుకురావడానికి వెలుతున్నానని శోభనా భర్త సెంథిల్ కు చెప్పింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన శోభనా తరువాత ఎంతసేపు అయినా ఇంటికి తిరిగి రాలేదు.
అడ్రస్ లేకుండా పోయింది
శోభనా ఇంటి నుంచి బయటకు వెళ్లిన రోజు రాత్రి 9 గంటలకు భర్త సెంథిల్ కు ఫోన్ చేసింది. రాత్రి చివరి బస్ తప్పిపోయిందని, తెలిసిన ఫ్రెండ్ కారులో ఇంటికి వస్తున్నానని సమాచారం ఇచ్చింది. అర్దరాత్రి దాటిన తరువాత శోభనా ఇటికి రాకపోవడంతో అనుమానంతో సెంథిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త సెంథిల్, పోలీసులు గాలించినా ఆ రోజు శోభనా అడ్రస్ మాత్రం చిక్కలేదు.
శవమైన శోభనా
శోభనా కనపడటం లేదని కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం గాలించారు. నమ్మక్కల్ కు సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చిన్న నీటి గుంతో ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. నీటి గుంతలో చిక్కిన మహిళ మృతదేహం శోభనాదే అని పోలీసులు నిర్దారించారు. శోభనా శరీరం మీద గాయాలు అయ్యాయి,
అర్దనగ్నంగా శోభనా శవం
శోభనా వేసుకున్న దుస్తులు పూర్తిగా చినిగిపోయాయి. శోభనా మీద అత్యాచారం చేసి తరువాత దారుణంగా హత్య చేశారని పోలీసులు గుర్తించారు. కుమారుడు దేవా కోసం తీసుకున్న కొత్త బట్టలు, చాక్లెట్ లు శోభనా మృతదేహం పక్కనే పడిఉండటంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నగదు, నగల కోసం శోభనా హత్యకు గురి కాలేదని పోలీసులు గుర్తించారు. శోభనా వేసుకున్న నగలు అలాగే ఉన్నాయి. నగల కోసం హత్య జరగలేదని పోలీసులు పసిగట్టారు.
ప్రియుడికి బెండ్ తీస్తే సినిమా స్టోరి
శోభనా మొబైల్ నెంబర్ ఆదారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. శోభనా ఇంటి నుంచి వెళ్లిన తరువాత రాత్రి 9 గంటలకు భర్త సెంథిల్ కు ఫోన్ చేసిందని, అదే రోజు చివరిసారిగా ప్రియుడు సురేష్ కు ఫోన్ కాల్ చేసిందని పోలీసులు గుర్తించారు. సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. అయితే శోభనాను తాను హత్య చెయ్యలేదని, అక్రమ సంబంధం మాత్రమే ఉందని సురేష్ తప్పుడు సమాచారం ఇచ్చాడు. తరువాత పోలీసులు సురేష్ మంచి కాపడం పెట్టడంతో ఫ్రెండ్స్ తో కలిసి శోభనా మీదఅత్యాచారం చేసి చంపేశామని సురేష్ అంగీకరించాడు. ప్రియుడిని నమ్మి వెళ్లిన శోభనా గ్యాంగ్ రేప్ కు గురై హత్యకు గురి కావడం కలకలం రేపింది.