friend wife: ఫ్రెండ్ భార్య జ్యూస్ పిండేశాడు, పోలీసులు తోలు తీసేశారు, కూల్ డ్రింక్ తో కూల్ గా స్కెచ్ !
చెన్నై: ఫ్రెండ్ భార్య ఎర్రగా, బుర్రగా, బలంగా ఉండటంతో భర్త ఫ్రెండ్ తట్టుకోలేకపోయాడు. పనిపాట లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఫ్రెండ్ ఇంటికి వెళ్లి వస్తున్న కామాంధుడు ఆమెను చాకచక్యంగా వలలో వేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఫ్రెండ్ భార్యతో చనువుగా ఉన్నాడు. మంచి రోజు చూసి జ్యూస్ లో మత్తుమందు కలిపి ఫ్రెండ్ భార్యకు ఇచ్చాడు. మత్తులోకి జారుకున్న ఫ్రెండ్ భార్యకు అంతకు ముందు తాగించిన జ్యూస్ మొత్తం పిండేశాడు. ఆ సమయంలో తీసిన ఆమె నగ్న వీడియోలు అడ్డం పెట్టుకుని కామవాంఛ తీర్చుకున్నాడు. తరువాత ఆ కామాంధుడు ఆ వీడియోలు అడ్డంపెట్టుకుని లక్షల రూపాయల డబ్బుతో పాటు భారీ మొత్తంలో బంగారు నగలు దోచుకున్నాడు. కిరాతకుడి టార్చర్ తట్టుకోలేని బాధితురాలు ఏం చెయ్యాలో అది చేస్తే మహేష్ కుమార్ కి పోలీసులు తోలు తియ్యడంతో షార్వా కారిపోయింది.
ఫ్రెండ్ భార్య యాపిల్ పండు
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలోని వాటర్ మెన్ పేట్ లో రాజు, అతని భార్య మాధురి (పేరుమార్చడం జరిగింది) నివాసం ఉంటున్నారు. రాజు భార్య మాధురికి 36 ఏళ్లు. మాధురి చూడటానికి లావుగా, ఎర్రగా, బుర్రగా, బలంగా యాపిల్ పండులాగా ఉంటుంది. రాజు, మాధురి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. హ్యాపీగా వ్యాపారం చేస్తున్న రాజు భారీ మొత్తంలో డబ్బులు సంపాధిస్తూ భార్య మాధురి, ఇద్దరు పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తున్నాడు. రాజు, మాధురి దంపతులు చెన్నైలోని వాషర్ మెన్ పేట్ లోనే కొన్ని సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు.
జ్యూస్+ హల్వా+ మత్తుమందు స్కెచ్
రాజు స్నేహితుడు మహేష్ కుమార్. మహేష్ కుమార్ అప్పుడప్పుడు అతని స్నేహితుడు రాజు ఇంటికి వెళ్లేవాడు. ఆ సమయంలో రాజు భార్య మాధురి కత్తిలాగా ఉందని, ఎలాగైనా ఆమెను అనుభవించాలని మహేష్ కుమార్ వేచిచూశాడు. ఓ రోజు రాజు ఇంటిలో లేడని తెలుసుకున్న మహేష్ డ్రగ్స్ కలిపిన జ్యూస్ తీసుకెళ్లి ఫ్రెండ్ భార్య మాధురికి ఇచ్చాడు. డ్రగ్స్ కలిపిన కూల్ డ్రింక్ తాగిన మాధురు మత్తులోకి జారుకుంది.
అనుభవించు రాజా
ముందుగానే డ్రగ్స్ కలిపిన జ్యూస్ తాగి, మహేష్ కుమార్ ఇచ్చిన హల్వా తిన్న మాధురి మత్తులోకి జారుకుంది. అప్పటికే సినిమా స్కెచ్ వేసిన మహేష్ కుమార్ ఫ్రెండ్ భార్య మాధురిని నగ్నంగా చేసి బెడ్ రూమ్ లో అత్యాచారం చేశాడు. మాధురి మత్తుదిగే వరకు పదేపదే ఆమెపై అత్యాచారం చెయ్యడమే కాకుండా మూడు గంటల ఆపాటు ఆ రాసలీలలను వీడియో తీశాడు. మత్తు దిగిన తరువాత నగ్నంగా ఉన్న మాధురి విషయం తెలుసుకుని షాక్ కు గురైయ్యింది.
లక్షల నగదు, బంగారు నగలు స్వాహా
మాధురికి ఆమె నగ్న వీడియోలు చూపించి తాను చెప్పినట్లు వినకుంటే ఈ వీడియోలు నీ భర్త రాజుకు చూపిస్తా అంటూ మహేష్ కుమార్ ఆమెపై పదేపదే అత్యాచారం చేస్తూ వచ్చాడు. అంతటితో మహేష్ కుమార్ ఆగడాలు ఆగలేదు. మాధురి దగ్గర ఉన్న 100 పౌండ్ల బంగారు నగలు, భారీ మొత్తంలో డబ్బులు లాక్కొన్నాడు. భర్త నీ బంగారు నగలు ఎక్కడ అని ప్రశ్నిస్తే మా పుట్టింటిలో ఉన్నాయి, ఈసారి వెళ్లిన తరువాత తెస్తాను, ఓపిక పట్టు అంటూ మాధురి కొంతకాలం గడిపింది.
కామాంధుడి టార్చర్ తారాస్థాయికి చేరింది
మహేష్ కుమార్ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోవడంతో మాధురి ఎదురుతిరిగింది. నువ్వు పోలీసులకు ఫిర్యాదు చేస్తే నీ భర్త, ఇద్దరు పిల్లలను చంపేస్తానని మహేష్ కుమార్ ఫ్రెండ్ భార్య మాధురిని బెదిరించాడు. చివరికి విసిగిపోయిన మాధురి చెన్నైలోని రాయపురం పోలీస్ స్టేషన్ లో మహేష్ కుమార్ మీద ఫిర్యాదు చెయ్యడంతో మూడు కేసులు నమోదు అయ్యాయి. కేసు విచారణ చేసిన పోలీసులు ఒక కేసులో మహేష్ కుమార్ ను అరెస్టు చేశారు. అయితే ఆ కేసులో మహేష్ కుమార్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. రెండు కేసులు ఇంకా విచారణ కొనసాగింది.
కోర్టుల చెట్టూ ప్రదర్శన
మాధురి మీద అత్యాచారం, నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశారని నమోదైన కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని మహేష్ కుమార్ చెన్నై జిల్లా కోర్టును ఆశ్రయించాడు. మహేష్ కుమార్ కు బెయిల్ ఇస్తే మళ్లీ తనను బెదిరించి సాక్షాలు నాశనం చేస్తాడని మాధురి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసు విచారణలో ఉందని, మహేష్ కుమార్ కు ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని పోలీసులు కోర్టులో మనవి చేశారు.
Recommended Video
దెబ్బకు మటాష్
మాధురి, మహేష్ కుమార్ కేసు వివరాలు తెలుసుకున్న చెన్నై జిల్లా ప్రత్యేక కోర్టు జడ్జి సెల్వకుమార్ నిందితుడు మహేష్ కుమార్ కు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. కేసు విచారణ సమయంలో బాధిత మహిళ మాధురిని వేధింపులకు గురి చేస్తే వెంటనే మహేష్ కుమార్ ను అరెస్టు చెయ్యాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీచేసింది. కోర్టు ఆదేశాలతో మళ్లీ మహేష్ కుమార్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. భర్త ఫ్రెండ్స్ తో అక్రమ సంబంధాలు పెట్టుకున్న కొందరు భార్యలకు 2020లో ఈ కేసు ఓ పెద్ద ఉదాహరణగా నిలించింది.