lady teacher: సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త డిమాండ్, స్కెచ్ వేసి చంపేసిన భార్య, రాత్రి ఏంజరిగిందంటే !
చెన్నై/తిరుమంగళం/మదురై: దంపతులకు వివాహం జరిగి కూతురు పుట్టింది. భర్త కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాడు. రాత్రిపూట బెడ్ రూమ్ లో తన కోరికలు తీర్చాలని, సెక్స్ పాఠాలు చెప్పాలని డిమాండ్ చేసిన భర్త భార్యకు టార్చర్ పెట్టాడు. దంపతుల మద్యగొడవ ఎక్కువ అయ్యింది. అంతే భార్యకు ఎక్కడో మండిపోయి భర్త మార్మంగం కొరికేసి చంపేసింది. మరుసటి రోజు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, పోలీసులు షాక్ కు గురైనారు. రాత్రి బెడ్ రూమ్ లో ఏం జరిగిందో భార్య బయటపెట్టింది. కోరిక తీర్చమని లైంగిక వేధింపులకు గురి చేసిన భర్తను స్వయంగా అతని భార్య హత్య చెయ్యడం కలకలం రేపింది.
అందమైన భార్య స్కూల్ లో టీచర్
తమిళనాడులోని మదురై జిల్లాలోని తిరుమంగళంకు చెందిన సుందర్ అలియాస్ సుధీర్ (34), అరుల్ సెల్వీ ( 28) అనే యువతికి 8 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. సుధీర్, అరుల్ సెల్వీ దంపతులకు జయశ్రీ అనే కుమార్తె ఉంది. కిజ్చంపట్టి ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో అరుల్ సెల్వీ టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది.
కలెక్టర్ ఆఫీసులో భర్త ఉద్యోగం
సుందర్ అలియాస్ సుధీర్ మదురై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నాడు. సుధీర్ కు లైంగిక కోరికలు చాలా ఎక్కువ అని సమాచారం. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న భార్య అరుల్ సెల్వీని తన లైంగిక కోరికలు తీర్చాలని సుధీర్ వేధింపులకు గురి చేశాడని సమాచారం.
రాత్రి చేతికి పనిపెడుతున్న భర్త
సుధీర్ ప్రతిరోజు రాత్రి బెడ్ రూమ్ లో భార్య సెల్వీ ముందు హస్త ప్రయోగం చేసుకుంటున్నాడని తెలిసింది. ఇదే విషయంలో కొంతకాలంగా సుధీర్, సెల్వీ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. తన భర్త సుధీర్ హస్త ప్రయోగం చేసుకుంటూ తన లైంగిక కోరికలు తీర్చాలని వేధింపులకు గురి చేస్తున్నాడని సెల్వీ చాలాకాలంగా కుమిలిపోతుందని ఆరోపణలు ఉన్నాయి.
భార్య ఏం కొరికిందో తెలుసా ?
రాత్రి సుధీర్, సెల్వీ, వారి కుమార్తె జయశ్రీ భోజనం చేసి నిద్రపోయారు. అర్దరాత్రి బెడ్ రూమ్ లో సుధీర్ తన లైంగిక కోరిక తీర్చాలని భార్య సెల్వీని హింసించాడని తెలిసింది. రాత్రి పూర్తిగా లైంగిక కోరికలు తీర్చాలని సుధీర్ వేధింపులు ఎక్కువ కావడంతో సెల్వీ సహనం కోల్పోయింది. తరువాత దంపతుల మధ్య తారాస్థాయిలో గొడవ జరగడంతో సెల్వీ భర్త సుధీర్ మర్మాంగం కొరికేసిందని సమాచారం.
అయ్యో సుధీర్... ఎంతపని జరిగింది
మరుసటి రోజు ఉదయం సుధీర్ బెడ్ మీద నుంచి మూర్చపోయిన స్థితిలో కిందపడిపోయాడు. వెంటనే సుధీర్ ను అతని కుటుంబ సభ్యులు తిరుమంగళం ప్రభుత్వ ఆసుపత్రిిక తరలించారు. సుధీర్ ను పరీక్షించిన వైద్యులు అతని ప్రాణాలు పోయానని నిర్దారించారు. అయితే సుధీర్ మర్మాంగం మీద రక్తపు మరకలు, కొరికన గాట్లు (కాట్లు) ఉన్న విషయం గుర్తించిన వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
టీచర్ కు ఇంత టార్చర్ పెట్టాడా ?
సుధీర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. సుధీర్ భార్య సెల్వీ సైతం పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. సార్ నేను స్కూల్ టీచర్, నా భర్త సుధీర్ ప్రతిరోజూ బెడ్ రూమ్ లో ఇలా టార్చర్ చేస్తున్నాడు, అందుకే సహనం కోల్పోయి మర్మాంగం కొరకడంతో అతను చనిపోయాడు అని సెల్వీ అంగీకరించడంతో పోలీసులు షాక్ అయ్యారు. శాడిస్టు భర్త చేష్టలతో కట్టుకున్న భార్య సెల్వీ చేతిలో సుధీర్ హత్యకు గురికావడం మదురై జిల్లాతో పాటు తమిళనాడులో కలకలం రేపింది.