friend wife: హాయ్ అన్నాడు, అంతే భర్తతో పాటు బెడ్ రూమ్ మార్చేసింది, హాట్ హాట్ రొమాన్స్, బూడిద!
చెన్నై/ బెంగళూరు: భర్తతో కలిసి హ్యాపీ సంసారం చేసుకుంటున్న మహిళకు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. భర్త ఫ్రెండ్ హాయ్ అని పరిచయం చేసుకోవడంతో అదికాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. తరువాత దంపతుల కాపురంలో చిచ్చురేపింది. ప్రియుడి వ్యామోహంలో పడిపోయిన మహిళ భర్త, కొడుకును గాలికి వదిలేసింది. ఏకంగా ప్రియుడితో కలిసి అతని ఇంట్లో బెడ్ రూమ్ లో ఉండిపోయింది. తన భార్య ప్రియుడితో కలిసి ఏకంగా కాపురం పెట్టిందని తెలుసుకున్న భర్త రగిలిపోయాడు. నేరుగా భార్య ఉంటున్న ఇంటి దగ్గరకు వెళ్లాడు. ప్రియుడి బెడ్ రూంలో ఉన్న భార్యతో పాటు ఆమె ప్రియుడి మీద పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఆమెను సజీవదహనం చేసి బూడిద చేశాడు.
పెళ్లాం కోసం సిగరెట్లు, మద్యం త్యాగం
చెన్నైలోని
ఎంజీఆర్
నగర్
వీధిలో
సెంథిల్
వేల్
మురుగన్
(38),
అతని
భార్య
లక్ష్మీ
(34)
నివాసం
ఉంటున్నారు.
సెంథిల్
వేల్
మురుగన్,
లక్ష్మీ
దంపతులకు
13
ఏళ్ల
వయసు
ఉన్న
కుమారుడు
ఉన్నాడు.
సెలూన్
షాప్
యజమాని
అయిన
సెంథిల్
వేల్
మురుగన్
భార్య
సంతోషంగా
ఉండాలని
ఉద్దేశంతో
అప్పుడప్పుడు
సేవించే
మద్యం,
సిగరేట్
వదిలేశాడు.
ఎప్పుడు
కష్టపడుతూ
భార్య,
కుమారుడు
సంతోషంగా
ఉండాలని
సెంథిల్
వేల్
మురుగన్
అనుకున్నాడు.
ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు అంతే !
ఎంజీఆర్ నగర్ లోని త్యాగి కుప్పం వీధిలో గోవిందస్వామి (42) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ సూపర్ వైజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. గోవిందస్వామి, సెంథిల్ వేల్ మురుగన్ స్నేహితులు అయ్యారు. సెంథిల్ వేల్ మురుగన్ ఇంటికి వచ్చి వెలుతున్న గోవిందస్వామి అతని భార్య లక్ష్మీ మీద కన్ను వేశాడు.
ఫ్రెండ్ భార్యతో హాట్ హాట్ గా !
స్నేహితుడు సెంథిల్ భార్య లక్ష్మీని హాయ్ అంటూ ఆమెతో హాట్ హాట్ గా మాటలు కలిపిన గోవిందస్వామి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. సెంథిల్ వేల్ మురుగన్ ఇంట్లో లేని సమయంలో వచ్చి వెలుతున్న గోవిందస్వామి లక్ష్మీని వలలో వేసుకున్నాడు. ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న గోవిందస్వామి ప్రతిరోజు సెంథిల్ వేల్ మురుగన్ లేని సమయంలో అతని ఇంటికి వెళ్లి లక్ష్మీతో రాసలీలలు సాగించడం మొదలుపెట్టాడు.
పాత మొగుడు అవసరమా ?
తన భార్య లక్ష్మీ గోవిందస్వామి అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న సెంథిల్ వేల్ మురుగన్ భార్యను పట్టుకుని చితకబాదేశాడు. ఇంకోసారి ఇలా జరిగిందని తెలిస్తే మీ ప్రాణాలు తీస్తానని సెంథిల్ వేల్ మురుగన్ భార్య లక్ష్మీని హెచ్చరించాడు. తన ప్రియుడు గోందస్వామితో జల్సాలు చెయ్యడానికి భర్త సెంథిల్ వేల్ మురుగన్ అడ్డుగా ఉన్నాడని లక్ష్మీ రగిలిపోయింది. లాక్ డౌన్ అమలు అయిన తరువాత కొంతకాలానికి లక్ష్మీ భర్త సెంథిల్ వేల్ మురుగన్, కుమారుడిని గాలికి వదిలేసి ఇంటి నుంచి వెళ్లి పోయింది.
భర్తను మార్చేసి ప్రియుడి బెడ్ రూమ్ లో రొమాన్స్
తన భార్య లక్ష్మీ ఇంటి నుంచి వెళ్లిపోయిన తరువాత ఎక్కువ సమయం గోవిందస్వామి ఇంట్లో ఉంటున్నదని తెలుసుకున్న సెంథిల్ వేల్ మురుగన్ రగిలిపోయాడు. క్యాన్ లో పెట్రోల్ తీసుకున్న సెంథిల్ వేల్ మురుగన్ పట్టపగలు నేరుగా గోవిందస్వామికి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో పట్టపగలు ప్రియుడి ఇంటిలోని బెడ్ రూంలో భార్య లక్ష్మీ ఉన్న విషయం చూసి సెంథిల్ వేల్ మురుగన్ ఆవేశంతో వెంట తీసుకెళ్లిన పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అదే సమయంలో భార్య ప్రియుడు గోవిందస్వామి మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
హమ్మయ్యా..... నా పెళ్లాం చచ్చిపోయింది
భార్య లక్ష్మీ, ఆమె ప్రియుడు గోవిందస్వామి మీద పెట్రోల్ పోసి నిప్పంటించిన సెంథిల్ వేల్ మురుగన్ వారు బయటకు రాకుండా ఇంటి బయట తాళం వేసుకుని పరారైనాడు. మంటలు వ్యాపించడంతో లక్ష్మీ, గోవిందస్వామి కేకలు వేశారు. చుట్టుపక్కల వారు ఇంటి తాళం పగటగొట్టి ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై లక్ష్మీ మరణించింది. గోవిందస్వామికి వైద్యులు చికిత్స అందిస్తున్నారని, సెంథిల్ వేల్ మురుగన్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.