Illegal affair: ఆంటీ ఫ్యాక్షన్ సినిమా స్కెచ్, ఓకే దెబ్బకు రెండు పిట్టలు, ఆంటీ కండలే కాదు ప్లాన్!
బెంగళూరు/ ముంబాయి/ బెళగావి: ఇంతకాలం తనకు స్వర్గం చూపించిన కుర్రాడు దూరం కావడంతో కండలు తిరిగిన ఆంటీ జీర్ణించుకోలేకపోయింది. వివాహిత మహిళ ఓ యువకుడితో కొన్ని ఏళ్లుగా అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇంతకాలం ఎర్రగా, బుర్రగా, కండలు తిరిగిన ఆంటీతో ఎంజాయ్ చేసిన ప్రియుడు ఆమె మోజు తీరిపోవడంతో మరో యువతిని పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నాడు. తనకు ప్రియుడు దూరం అయ్యాడని ఆ మహిళ ఆవేశంతో ఊగిపోయింది. తనకు ప్రియుడు దూరం కావడానికి ఆమె భార్య కారణం అని కక్ష పెంచుకుంది. ప్రియుడి భార్య గర్బవతి అయ్యింది. తనకు ప్రియుడు దగ్గర కావాలంటే అతని భార్యను చంపేయాలని ఆంటీ స్కెచ్ వేసింది. అంతే ప్రియుడి భార్యతో పాటు ఆమె పక్కింటిలో నివాసం ఉంటున్న మహిళను అతి దారుణంగా హత్య చేయించింది. రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాను తలతన్నే రీతిలో జరిగిన జంటహత్యల కేసు అనేక ఊహించని విధంగా మలుపులు తిరగడంతో పోలీసులు బిత్తరపోయారు.
కండలు తిరిగి కసిగా ఉన్న కల్పనా ఆంటీ
కర్ణాటకలోని బెళగావి (మహారాష్ట్ర సరిహద్దు)లోని మాచే గ్రామానికి చెందిన గంగప్ప అలియాస్ గంగ, బెళగావి నగరం సమీపంలోని కలైనట్టి ప్రాంతంలో నివాసం ఉంటున్న మరాఠీ ముద్దుగుమ్మ కల్పనా అనే ఆంటీ గత కొన్ని సంవత్సరాల నుంచి అక్రమ సంబంధం పెట్టుకున్నారు. అసలే మరాఠి ఆంటీ కల్పనా ఎర్రగా, బుర్రగా, బలంగా ఉండటంతో గంగ ఆమెను తగులుకున్నాడు. కొన్ని సంవత్సరాల పాటు కల్పనా, గంగ కర్ణాటక, మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలకు వెళ్లి వస్తూ పిచ్చపాటిగా ఎక్కడంటే అక్కడకు వెళ్లి ఎంజాయ్ చేశారు.
ఆంటీ మోజు తీరిపోయింది
కల్పనా ఆంటీతో కొన్ని సంవత్సరాలు ఎంజాయ్ చేసిన గంగ 2019లో ఇంట్లో కుటుంబ సభ్యులు చూపించిన రోహిణి (23) అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. రోహిణిని పెళ్లి చేసుకున్న తరువాత గంగ అతని ప్రియురాలు కల్పనా ఆంటీకి రానురాను దూరం అయ్యాడు. ఇంతకాలం శారీరక సుఖం ఇచ్చిన గంగ దూరం అవుతున్నాడని పసిగట్టిన కల్పనా అతన్ని ఎలాగైనా దగ్గర చేసుకోవాలని ప్లాన్ వేసింది. అయితే గంగ మాత్రం కట్టుకున్న భార్య రోహిణికి ద్రోహం చెయ్యలేక కల్పనా ఆంటీకి పూర్తిగా దూరం అయ్యాడు.
రోహిణి ఎంత పనిచేసింది ?
తన ప్రియుడు గంగ తనకు దగ్గర కావాలంటే అతని భార్య రోహిణిని చంపేయాలని కల్పనా ఆంటీ స్కెచ్ వేసింది. అదే సమయంలో రోహిణి గర్బవతి అయ్యింది. రోహిణి గర్బవతి అని తెలిసినా ఆమెను వదిలిపెట్టకూడదని, హత్య చేయించి తన ప్రియుడు గంగను దగ్గర చేసుకోవాలని కల్పనా కిరాయి హంతకులను ఆశ్రయించింది. మీరు ఎంత అడిగితే అంత డబ్బులు ఇస్తాను, రోహిణిని చంపేయండి అంటూ కల్పనా ఫ్యాక్షన్ సినిమాలో లేడీ విలన్ లాగా రెచ్చిపోయింది.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు
సెప్టెంబర్ నెలలో గంగ భార్య రోహిణి, తన పక్కింటిలో నివాసం ఉంటున్న సమీప బంధువు రాజశ్రీ అనే మహిళతో కలిసి గ్రామం సమీపంలో వాకింగ్ చేస్తోంది. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు రోహిణి, రాజశ్రీని అడ్డుకున్నారు. తరువాత వెంట తీసుకెళ్లిన కత్తులు, వేటకొడవళ్లు తీసుకుని గంగ భార్య రోహిణి గర్బవతి అని కూడా ఆలోచించకుండా అతి దారుణంగా నరికి చంపేశారు. రోహిణిని హత్య చేస్తున్న సమయంలో హంతకులను చూసిన రాజశ్రీ పారిపోవడానికి ప్రయత్నించింది. పోలీసులకు సాక్షం చెబుతుందనే భయంతో నిందితులు రాజశ్రీని వెంటాడి వెంటాడి నరికి చంపేసి అక్కడి నుంచి పారిపోయారు.
పోలీసులకు దిమ్మతిరిగిపోయింది
గర్బవతి అయిన రోహిణి, ఆమె సమీప బంధువు రాజశ్రీ దారుణ హత్య కు గురి కావడంతో బెళగావితో పాటు కర్ణాటకలో కలకం రేపింది. బెళగావి సిటీ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ విక్రమ్ దుర్గే స్వయంగా రంగంలోకి దిగి కేసు విచారణ చేశారు. ఇద్దరు మహిళలను అతిదారుణంగా ఎవరు హత్య చేశారు ? అని ఆరా తీశారు. గర్బిణి రోహిణితో పాటు రాజశ్రీని హత్య చేయించింది కల్పనా అని తెలుసుకున్న పోలీసులు బిత్తరపోయారు. కొన్ని రోజుల తరువాత కల్పనా ఆంటీని అదుపులోకి తీసుకున్నారు.
రమ్యకృష్ణ నీలాంబరి డైలాగులు
తన ప్రియుడు గంగ తన దగ్గరకు రానివ్వకుండా అతని భార్య రోహిణి అడ్డుకుంటున్నదని కల్పనా ఆంటీ పోలీసులకు చెప్పింది. అందుకే తనకు దక్కంది ఎవ్వరికీ దక్కకూడదు అని నిర్ణయించుకుని కిరాయి హంతకులతో తన మాజీ ప్రియుడు గంగ భార్య రోహిణిని చంపాలని స్కెచ్ వేశానని, అడ్డు వచ్చిన రాజశ్రీని చంపేశామని సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన నరసింహ సినిమాలో ప్రముఖ నటి రమ్యకృష్ణ నీలాంబరి క్యారెక్టర్ లో ఎలా డైలాగులు చెప్పిందో అచ్చం అలాగే కల్పనా ఆంటీ పోలీసుల విచారణలో అంగీకరించింది.
మరాఠీ ఆంటీ.... కన్నడ ప్రియుడి లవ్ స్టోరీతో షాక్
జంట మహిళల హత్య కేసులో కల్పనా ఆంటీతో పాటు కిరాయి హంతకుల ముఠాకు చందిన మహేష్ నాయక్, రాహుల్ పాటిల్, గణేష్ పూర్ కు చెందిన రోహిత్ వాటల్, కలనట్టికి చెందిన షానూర్ పన్నా అనే నిందితులను అరెస్టు చేశాసి జైలుకు పంపించామని బెళగావి సిటీ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ విక్రమ్ చెప్పారు. మొత్తం మీద ప్రియుడి వ్యామోహంలో అతని భార్యను కిరాయి హంతకులతో కల్పనా ఆంటీ హత్య చేయించింది అని వెలుగు చూడటంతో బెళగావితో పాటు మహారాష్ట్రలో కలకలం రేపింది. కొన్ని నెలల నుంచి కల్పనా ఆంటీతో పాటు కిరాయి హంతకులు బెయిల్ రాకపోవడంతో బెళగావి సెంట్రల్ జైలులో చిప్పకూడు తింటున్నారు.