వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Girlfriend: మేడమ్ కు భర్త, సార్ కు భార్య లేరు, రాత్రి ఎంజాయ్ చేసి ఇనుపరాడ్ తో, అప్పుడు లేని భయం !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ కోయంబత్తూరు/ మదురై: అక్రమ సంబంధం కారణంగా ప్రియురాలిని ఆవేశంలో చంపేసి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చికెన్ సెంటర్ లో భారీగా డబ్బులు సంపాధిస్తున్న వ్యక్తికి పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహిళ భర్తను వదిలేసి ఒంటరిగా నివాసం ఉంటున్నది. చికెన్ షాప్ కు వెళ్లి వస్తున్న ఆమె ఆ షాపు యజమానిని తగులుకుంది. ఇలా వీరి రాసలీలలు ఫ్రెండ్స్ అడ్డాకు మారిపోయాయి. భర్త చెంఢాలం చూడలేక చికెన్ షాప్ యజమాని భార్య పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. రాసలీలలకు రాత్రి రమ్మని ప్రియురాలు ఫోన్ చేసిన తరువాత ఓ విషయంలో తేడా రావడంతో ప్రియుడు ఇనుప రాడ్ తీసుకుని ప్రియురాలిని అతి దారుణంగా హత్య చేశాడు. ప్రియురాలిని హత్య చేసిన తరువాత పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో అతను అదే గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Aunty: కొడుకు ఫ్రెండ్, టిఫిన్ పెడుతానని ఆంటీ ఫుల్ మీల్స్ పెట్టింది, భర్త దెబ్బకు బెడ్ రూమ్ లో బ్లాక్ బ్యూటీ!Aunty: కొడుకు ఫ్రెండ్, టిఫిన్ పెడుతానని ఆంటీ ఫుల్ మీల్స్ పెట్టింది, భర్త దెబ్బకు బెడ్ రూమ్ లో బ్లాక్ బ్యూటీ!

 భర్త లేడు కానీ.... కోరికలు మాత్రం ?

భర్త లేడు కానీ.... కోరికలు మాత్రం ?

తమిళనాడులోని కోవై ( కోయంబత్తూరు)లోని కాలవట్టి నెహ్రూనగర్ లో తిలకవతి (33) అనే మహిళ భర్త, ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉంటున్నది. అయితే ప్రతినిత్యం తిలకవతికి ఆమె భర్తతో గొడవలు జరుతున్నాయి. తిలకవతి తిక్క చేష్టలు, ఆమె నడవడిక, పరాయి పురుషులతో చనువుగా ఉండటం చూసి తట్టుకోలేని ఆమె భర్త వేరుగా వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇద్దరు కుమారులతో కలిసి తిలకవతి వేరుగా కాపురం ఉంటోంది. భర్త దూరం అయినా తిలకవతి కామ కోరికలు మాత్రం పెరిగిపోయాయి.

 బడ్జెట్ పద్మనాభం

బడ్జెట్ పద్మనాభం

కోయంబత్తూరులోని నెహ్రూనగర్ లో పద్మనాభం (37) అలియాస్ చికెన్ పద్మ అనే వ్యక్తి చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ప్రతిరోజు వ్యాపారం జోరుగా సాగడంతో పద్మనాభం దిక్కులేనంత డబ్బులు సంపాధిస్తున్నాడు. పద్మనాభంకు ఇంతకు ముందే వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. హ్యాపీగా డబ్బులు సంపాధిస్తున్న పద్మనాభం భార్య, పిల్లలతో కలిసి కొన్ని నెలల వరకు చాలా సంతోషంగానే ఉండేవాడు.

 చికెన్ కోసం వెళ్లి చింపేసింది

చికెన్ కోసం వెళ్లి చింపేసింది

చికెన్ సెంటర్ కు వచ్చి వెలుతున్న తిలకవతితో ఆ షాపు యజమాని పద్మనాభంకు పరిచయం అయ్యింది. తరువాత తిలకవతి, పద్మనాభం పరిచయం చనువుగా మారింది. భర్తను వదిలిసిన వయ్యారిభామ తిలకవతి డబ్బులు బాగా సంపాధిస్తున్న పద్మనాభంకు వలవేసింది. అంతే అప్పటి నుంచి తిలకవతి, పద్మనాభం ఇద్దరు రాసలీలలు సాగించడంతో తగులుకున్నారు.

 భరించలేని భార్య పరార్

భరించలేని భార్య పరార్

చికెన్ సెంటర్ యజమాని పద్మనాభం ప్రతినిత్యం రాసలీలలు సాగించడానికి ప్రియురాలు తిలకవతి ఇంటికి వెళ్లి వెళ్లేవాడు. ఈ విషయం తెలుసుకున్న పద్మనాభంను అతని భార్య నిలదీసింది. నా ఇష్టం వచ్చిన వాళ్లతో తిరుగుతాను, నీకు ఇష్టం ఉంటే ఇంట్లో ఉండు లేకపోతే వెళ్లిపో అని పద్మనాభం తేల్చి చెప్పాడు. భర్త పద్మనాభం చంఢాలం చూడలేని అతని భార్య ఇద్దరు పిల్లలను పిలుచుకుని పుట్టింటికి వెళ్లిపోయి విడాకులు తీసుకోవడానికి సిద్దం అయ్యింది.

 షెడ్ లు ఎందుకో కడితే ఎందుకో ఉపయోగపడింది

షెడ్ లు ఎందుకో కడితే ఎందుకో ఉపయోగపడింది

ఆరు నెలల క్రితం కరోనా వైరస్ అరికట్టడానికి లాక్ డౌన్ విధించడంతో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు, కార్మికుల కోసం తమిళనాడు ప్రభుత్వం కోవై సమీపంలో తాత్కాలిక షెడ్లు నిర్మించింది. షెడ్ లు ఖాళీగా ఉండటంతో పద్మనాభం బేవర్సా గ్యాంగ్ అక్కడ రోజు పేకాట, క్యారెమ్స్ ఆడుతున్నారు. తిలకవతి, పద్మనాభం రాసలీలలు సాగించడానికి రాత్రిపూట ఇంట్లో పిల్లలు అడ్డంగా ఉండటంతో వారు ఆ షెడ్లలోకి వెళ్లి ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో తనను పెళ్లి చేసుకోవాలని తిలకవతి కొంత కాలంగా పద్మనాభం మీద ఒత్తిడి చేస్తూ వస్తోంది. అయితే తెలివైన పద్మనాభం తిలకవతితో ఎంజాయ్ చేస్తూ పెళ్లి మాత్రం చేసుకోకుండా ఈ రోజు రేపు అంటూ కాలం గడుపుతున్నాడు.

 ఎంజాయ్ చేసి ఇనుప రాడ్ తో !

ఎంజాయ్ చేసి ఇనుప రాడ్ తో !

జూన్ 15వ తేదీ రాత్రి ఫోన్ చేసిన తిలకవతి మనం రోజు కలుసుకునే షెడ్ దగ్గరకు రావాలని చెప్పింది. ఆ రోజు రాత్రి వెళ్లిన పద్మనాభం తిలకవతితో ఎంజాయ్ చేశాడు. తరువాత ఇద్దరి మద్య పెళ్లి విషయంలొ గొడవ జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన పద్మనాభం ముందుగా ఆ షెడ్ లో దాచిపెట్టుకున్న ఇనుప రాడ్ తీసుకుని తిలకవతి తలపై చితకబాదేశాడు. తలకు తీవ్రగాయాలైన తిలకవతి అక్కడికక్కడే మరణించింది.

 చంపినప్పుడు లేని భయం తరువాత ?

చంపినప్పుడు లేని భయం తరువాత ?

పోలీసులకు తెలిస్తే తనను జైలుకు పంపిస్తారనే భయంతో ఆందోళనకు గురైన పద్మనాభం అదే షెడ్ లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం షెడ్ దగ్గర తిలకవతి, పద్మనాభం శవాలు చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం వెలుగు చూసింది. తిలకవతి హత్యకు గురి కావడం, తండ్రి దూరం కావడంతో ఆమె ఇద్దరు పిల్లలు ఇప్పుడు రోడ్డున పడ్డారు. తిలకవతి పిల్లలను ఆమె తల్లిదండ్రులు ఇప్పుడు పెంచిపోషిస్తున్నారు.

English summary
Year Ender 2020: Man suicide after killed his girl friend near Coimbatore in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X