khiladi wife: భర్తను లేపేయాలని భార్య భలే స్కెచ్, పుట్టింటి పక్కనే ప్రియుడు, ఫ్రెండ్స్, జస్ట్ మిస్ !
చెన్నై/ అంబత్తూరు: అక్రమ సంబంధం కారణంగా ప్రియుడు, అతని ఫ్రెండ్స్ సహాయంతో భర్తను లేయాలని భార్య విఫలయత్నం చేసింది. భార్య ప్రియుడు, అతని స్నేహితులు కలిసి కదులుతున్న రైలు నుంచి భర్తను కిందకు తోసివేసి హత్య చెయ్యడానికి ప్రయత్నించారు. తీవ్రయాలైన భర్త పోలీసులను ఆశ్రయించాడు. తన ప్రియుడు, పుట్టింటి పక్కన ఉన్న ప్రియుడు, కిరాయి హంతకులతో తన భర్తను హత్య చేయిండానికి తానే పక్కాప్లాన్ వేశానని భార్య అంగీకరించింది. భార్య స్కెచ్ తెలుసుకున్న పోలీసులు అబ్బా... యూ ట్యూబ్ లో చూశావా తల్లి అంటూ ఆమెకు బెండ్ తీశారు.
చెన్నై సిటీలో కాపురం
చెన్నైలోని అవడికి ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ (30) అనే యువకుడు భార్య అశ్విని, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నారు. చెన్నైలోని అంబత్తూరులోని ప్రైవేట్ కంపెనీలో రాజేంద్రన్ ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేసి ఇంటికి వెళ్లి భార్య అశ్విని, ముగ్గురు పిల్లలతో కలిసి రాజేంద్ర సుఖంగా ఉండేవాడు.
అందుబాటులో అశ్విని లవర్
రాజేంద్రన్ భార్య అశ్విని పుట్టిల్లు పెరంబూరులోని సెంబియంలో ప్రాంతంలో ఉంది. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న అనురగువంశి (22) అనే యువకుడితో అశ్వినికి పరిచయం ఏర్పడింది. భర్త, ముగ్గురు పిల్లలు ఉన్న అశ్విని అనురగువంశి వలలో పడింది. పుట్టిల్లుకు వెళ్లి వచ్చే ముసుగులో అశ్విని ప్రియుడు అనురగువంశితో కలిసి తిరిగింది. భార్య అశ్విని, అనురగువంశిల అక్రమ సంబంధం విషయం ఆమె భర్త రాజేంద్రన్ కు తెలిసింది.
ఏమండి... పుట్టింటికి వెలుతున్నా !
భార్య అశ్విని ఎప్పుడు పడితే అప్పుడు పుట్టింటికి వెళ్లడం మొదలు పెట్టింది. భార్య అశ్విని అక్రమ సంబంధం తెలిసిన భర్త రాజేంద్రన్ రగిలిపోయాడు. జాగ్రత్తగా ఉండాలని, పిల్లల భవిష్యత్తు చూడాలని, నువ్వ ఇలాగే ప్రవర్తిస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయని రాజేంద్రన్ భార్య అశ్వినిని హెచ్చరించాడు. రాజేంద్రన్, అశ్వినిల మధ్య నిత్యం ఆమె ప్రియుడు అనురగువంశి విషయంలో గొడవలు ఎక్కువ అయ్యాయి. తరువాత భర్త రాజేంద్రన్ ను వదిలేసిన అశ్విని పెరంబూరులోని పుట్టిల్లు చేరుకుంది. పుట్టిల్లులో ఉండే ముసులో ప్రియుడు అనురగువంశితో కలిసి విచ్చలవిడిగా తిరగడం మొదలుపెట్టింది.
కొత్త సంవత్సరం కోసం
2019 డిసెంబర్ 30వ తేదీన రాజేంద్రన్ తిరుత్తిణి వెళ్లేందుకు అవడితో విద్యుత్ రైలు ఎక్కాడు. రాజేంద్రన్ ను వెంబడించిన అశ్విని ప్రియుడు అనురగువంశి, అతని అనుచరులు విద్యుత్ రైలు ఎక్కారు. రైలు కదులుతున్న సమయంలో అందరూ కలిసి రాజేంద్రన్ ను కిందకు తోసేసి అక్కడి నుంచి పరారైనారు.
మీరే కాపాండి సార్
రైలు నుంచి కిందకు తోసేయడంతో రాజేంద్రన్ కు తీవ్రగాయాలైనాయి. అరక్కోణం ఆసుపత్రిలో చికిత్స పొందిన రాజేంద్రన్ తను హత్యకు తన భార్య అశ్విని, ఆమె ప్రియుడు అనురగువంశి, అతని స్నేహితులు కుట్ర పన్నారని, రైలులో నుంచి కిందకు తోసేశారని రాజేంద్రన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేంద్రన్ ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు అతని భార్య అశ్విని ఇంటికి చేరుకుని విచారణ చేశారు.
అవును.... నేనే స్కెచ్ వేశాను
తన భర్త రాజేంద్రన్ హత్యకు తన ప్రియుడు అనురగువంశితో కలిసి ప్లాన్ వేశానని అశ్విని అంగీకరించిందని పోలీసులు అన్నారు. రాజేంద్రన్ మీద హత్యాయత్నం చేశారనే కేసులో అతని భార్య అశ్విని, ఆమె ప్రియుడు అనురగువంశి, అతని స్నేహితులు కమలేశ్వరన్, దినేష్ అనే నిందితులను అరెస్టు చేశారు. 2020 జనవరి 1వ తేదీనే చెన్నైలో ఇలాంటి కేసు నమోదు కావడంతో దేవుడా ఇలాంటి గిఫ్ట్ ఇచ్చావు స్వామి అంటూ చెన్నై సిటీ పోలీసులు హడలిపోయారు.