100 శాతం విశ్వాస తీర్మాణంలో విజయం సాధిస్తాం... యడ్యూరప్ప
మరో కొద్ది గంటల్లో కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస తీర్మాణంలో తాము నెగ్గుతామని ముఖ్యమంత్రి యడ్యూరప్ప దీమా వ్యక్తం చేశాడు. వంద శాతం విశ్వాస పరీక్షలో విజయం సాధిస్తామని అన్నారు. ఇక విశ్వాస పరీక్ష అనంతరమే ఆర్ధిక బిల్లుకు ఆమోదం తెలుపుతామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లును యథావిధిగా సభలో ప్రవేశ పెడతామని తెలిపారు.
మరోవైపు స్పికర్ రమేశ్ కుమార్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రాజీనామ చేసిన మిగితా 14 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశాడు. ఆదివారం ఒకేసారి 14 మందిపై వేటు వేయడంతో అనర్హత వేటు పడిన వారి సంఖ్య మొత్తం 17కు చేరింది. దీంతో సభలో మొత్తం సభ్యుల సంఖ్య ఈ సంఖ్య 207కి పడిపోయింది. మ్యాజిక్ ఫిగర్ 105 కాగా.. బీజేపీకి సొంతంగా 105 మంది సభ్యులు.. స్వతంత్రులు ఇద్దరు కలిపి ఆ పార్టీ బలం 107కి చేరింది. మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్ బలం 99కి పడిపోయింది. ఈ నేపథ్యంలోనే యడ్యూరప్ప తమకు ఎలాంటీ ఇబ్బంది లేదని దీమాను వ్యక్తం చేశాడు.