వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యడ్యూరప్ప సంచలనం .. సర్జికల్ స్ట్రైక్ తో కర్ణాటక లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఖాతాలో 22 స్థానాలు

|
Google Oneindia TeluguNews

కర్ణాటక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్త చర్చకు కారణం అవుతున్నాయి. పాకిస్తాన్ లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేసిన దాడులతో దేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి పాజిటివ్ వచ్చిందన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందని కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 28 స్థానాల్లో 22 స్థానాల్లో బిజెపి విజయకేతనం ఎగర వేస్తుందని చెప్పారు.

పాకిస్థాన్ లో ఉగ్రవాదులు శిబిరాలపై భారతదేశం సర్జికల్ స్ట్రైక్ చేసి వేసిన ముందడుగు కారణంగా భారత ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారని కర్ణాటక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బి ఎస్ యడ్యూరప్ప తెలిపారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో లోక్సభ ఎన్నికలకు పాకిస్తాన్ ఉగ్రవాదులు శిబిరాలపై దాడులు చేసి ప్రధాని నరేంద్ర మోడీ ఒక పాజిటివ్ వేవ్ సృష్టించారని ఆయన పేర్కొన్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని మొత్తం 28 లోకసభ స్థానాలలో ఇరవై రెండు స్థానాలలో బిజెపి విజయకేతనం ఎగరవేయడానికి ఈ ముందడుగు ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ సహాయం చేశారని ఆయన పేర్కొన్నారు.

Yeddyurappa sensation.. BJP will win 22 seats in Karnataka Lok Sabha election with Surgical Strike

చిత్రదుర్గ లో విలేకరులతో మాట్లాడిన ఆయన పాకిస్తాన్ భూభాగం లోకి ప్రవేశించి భారత ప్రభుత్వం మూడు తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిందని, దేశవ్యాప్తంగా మోడీ అనుకూల పవనాలను ఇది తెచ్చిపెట్టిందని, దీని ప్రభావం రానున్న ఎన్నికల్లో తప్పక ఉంటుందని యడ్యూరప్ప పేర్కొన్నారు. తాజాగా యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్నాయి. పుల్వామా ఉగ్రదాడుల లో 40 మంది భారత సైన్యాన్ని కోల్పోయిన భారతదేశం ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్ చేస్తే దానిని రాజకీయాలతో లింకు పెట్టడం సమంజసం కాదనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
English summary
Karnataka BJP chief BS Yeddyurappa on Wednesday said India's 'preemptive' strikes on terror camps in Pakistan have created a wave in favour of Prime Minister Narendra Modi and will help the party win over 22 of 28 seats in Karnataka in the coming Lok Sabha elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X