4 రోజుల పాటు బ్యాంక్ సేవలు బంద్.. ఖాతాదారులకు ఈమెయిల్
ఈనెల 10 సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 9 గంటల వరకు యస్ బ్యాంక్ కు చెందిన నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఈపేమెంట్స్ (నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్) సేవలు నిలిచిపోనున్నాయి.
ముంబై: దేశంలోనే ఐదో పెద్దప్రైవేటు బ్యాంకు 'యస్ బ్యాంక్' ఖాతాదారులకు ఒక చేదు వార్త. అదేమిటంటే... నాలుగు రోజుల పాటు ఈ బ్యాంకు కు చెందిన ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయున్నాయి.
అవును.. ఈ విషయాన్ని స్వయంగా ఈ బ్యాంకే ప్రకటించింది. నాలుగు రోజుల పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు నిలిపి వేస్తున్నట్లు తన ఖాతాదారులందరికీ ఈమెయిల్ పంపించింది.
వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు తమ సిస్టంను అప్ గ్రేడ్ చేస్తున్నట్లు ఆ ఈమెయిల్ లో బ్యాంక్ పేర్కొంది. సిస్టం అప్ గ్రెడేషన్ కు నాలుగు రోజుల సమయం పడుతుందని, అందుకోసం ఈ నాలుగు రోజులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను నిలిపివేస్తున్నామని తెలిపింది.
ఈనెల 10 సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 9 గంటల వరకు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఈపేమెంట్స్ (నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్) సేవలను బంద్ చేస్తున్నట్లు పేర్కొన్న యస్ బ్యాంక్ వినియోగదారులు సహకరించాలని ఈమెయిల్ లో కోరింది.