దేశంలో అందరికంటే పాపులర్ సీఎం ఎవరో తెలుసా?..
న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫేస్బుక్ పాపులారిటీలో దేశంలోని మిగతా ముఖ్యమంత్రులందరి కంటే ముందున్నారు. ఈ విషయాన్ని ఫేస్బుక్ అధికారికంగా వెల్లడించింది. మిగతా సీఎంలతో పోలిస్తే యోగి ఫేస్బుక్ పేజీకి ఎక్కువ పాపులారిటీ ఉన్నట్టు తెలిపింది.
'ఇండియాలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ వర్గాలకు సంబంధించి ఫేస్బుక్లో టాప్ లో ఉన్నవారి సమాచారాన్ని ఇటీవల విడుదల చేశాం. ఇందుకోసం జనవరి 1,2017 నుంచి డిసెంబర్ 31, 2017 కాలాన్ని పరిగణలోకి తీసుకున్నాం. ముఖ్యంగా షేర్స్, కామెంట్స్ ఆధారంగా ఈ డేటా రూపొందించాం.' అని ఫేస్బుక్ తెలిపింది.
గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, రాజస్తాన్ సీఎం వసుంధర రాజేలను దాటి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫేస్బుక్ పాపులారిటీలో ముందున్నట్టు పేర్కొంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, రాజస్తాన్ సీఎం వసుంధర రాజేలకు యోగి కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నప్పటికీ.. షేర్స్, కామెంట్స్ రీత్యా యోగికే ఎక్కువ పాపులారిటీ ఉన్నట్టు వెల్లడించింది.