ఓ ఇంటర్వ్యూలో రామమందిరం అంశంపై యోగి ఆదిత్యనాథ్
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అంశాన్ని చర్చల ద్వారానే పరిష్కరించుకోగలమని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ఆయన ఆరెస్సెస్ పత్రిక పాంచజన్యకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
లక్నో: అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అంశాన్ని చర్చల ద్వారానే పరిష్కరించుకోగలమని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ఆయన ఆరెస్సెస్ పత్రిక పాంచజన్యకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
యోగి ఆదిత్యనాథ్ 'గురుభాయ్' హిందుత్వాన్ని స్వీకరించిన ముస్లీం
రామ మందిరంపై సుప్రీం కోర్టు సూచనలను తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చునని అభిప్రాయపడ్డారు. ఏదైనా సందర్భంలో ప్రభుత్వం జోక్యం కావాలని కోరుకుంటే, తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
అక్రమ వధశాలల అంశంపై కూడా యోగి స్పందించారు. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వుల మేరకు నడుచుకుంటున్నట్లు చెప్పారు. 2015లో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్, 2017లో హైకోర్టు అక్రమ వధశాలలపై యూపీ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసిందని చెప్పారు.
ఆ సూచనలను తాము పాటిస్తున్నామని తెలిపారు. అక్రమ వధశాలలపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎవరికైనా లైసెన్స్ ఉంటే వాటిని తాము ఆపమని చెప్పారు. లైసెన్స్ ఉన్న వాటిని అడ్డుకుంటే అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.