యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
ఆ జంట రొమాన్స్, స్థానికుల ఫిర్యాదు: 'యోగి సంస్థ కొట్టలేదు'
గురువారం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రయివేటు మెడికల్ కాలేజీలలో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ తెగలు, ఇతర బ్యాక్వర్డ్ క్యాస్ట్ వారికి కోటా బేస్డ్ రిజర్వేషన్లకు ముగింపు పలకనున్నట్లు చెప్పారు.
సమాచారం మేరకు, ఎస్సీ, ఎస్టీ, ఏబీసీలకు ప్రయివేటు మెడికల్ కాలేజీలలోని పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో కోటా రిజర్వేషన్లు ఇవ్వవద్దని నిర్ణయించారు.
అలాగే, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోను ప్రస్తుతం ఆరో తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం ఉంది. దానిని నర్సరీ నుంచి ప్రవేశ పెట్టాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో యోగా, సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రాంలు తప్పనిసరి చేశారు.