కాలుపై దేవత టాట్టూ: బెంగళూర్లో ఆస్ట్రేలియా జంటపై దాడి
బెంగళూరు: ఆస్ట్రేలియాకు చెందిన ఓ జంటను బెంగళూరులో స్థానికులు చితకబాదారు. ఈ సంఘటన శనివారం జరిగింది. హిందూ దేవతల టాట్టూలు వేసుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు వారిని కొట్టారు. క్షమాపణలు చెప్పేదాకా వదలలేదు.
ఆస్ట్రేలియా నుంచి భారత్కు టూరిస్టులుగా వచ్చిన మాట్ కీత్ (21), అతని గర్ల్ ఫ్రెండ్ ఓ హోటల్లో కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు వ్యక్యులు, అతని కాలిపై ఎల్లమ్మ దేవి బొమ్మ, వీపుపై గణేష్ బొమ్మ టాటూ రూపంలో ఉండటాన్ని గమనించారు.
కాలి పైన ఎల్లమ్మ దేవి బొమ్మ వేసుకొని హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. దీంతో, అక్కడున్న కొందరికి కోపం వచ్చింది. హిందూమతన్ని అవమానించారని, తక్షణం టాటూ చెరిపేసుకోవాలని డిమాండ్ చేశారు. వారిపై చేయి చేసుకున్నారు.
అనంతరం పోలీసులకు అప్పగించారు. కాలి పైన టట్టూను తొలగించుకోవాలని పోలీసులు సూచించారు. ఇందుకు సంబంధించి మాట్ కీత్ ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టాడు. తాను భారతదేశాన్ని, హిందూమతాన్ని గౌరవిస్తానని అందులో పేర్కొన్నాడు.