వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఊరకుక్కలా వెంటపడిన అన్న, కోరిక తీర్చాలని లైంగిక వేధింపులు, కొడవలితో నరికి చంపేసింది!

|
Google Oneindia TeluguNews

చెన్నై: వరుసకు సోదరుడైన వ్యక్తి చిత్తకార్తె కుక్కలా వెంటపడి లైంగిక వేధింపులకు గురి చెయ్యడంతో తట్టుకోలేని మహిళ కొడవలితో అతన్ని దారుణంగా హత్య చేసింది. ఎంత చెప్పినా శారీరకంగా, ఫోన్లు చేసి మానసికంగా వేధింపులకు గురి చెయ్యడంతో వరుసకు అన్న అయ్యే వ్యక్తిని చంపేస్తానని బాధితురాలు పోలీసుల ముందు అంగీకరించింది. సోదరుడిని హత్య చేసిన మహిళ,ను ఆమె భర్తను అరెస్టు చేసిన పోలీసులు వివిద కోణాల్లో విచారణ చేస్తున్నారు. అయితే హత్య చేసిన మహిళ పూటకు ఒక మాట చెప్పడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!

వరుసకు అన్న

వరుసకు అన్న

తమిళనాడులోని తేనీ జిల్లా ఉత్తమపాళయంలో పాండీశ్వరన్ (27), నిరంజన (23) దంపతులు నివాసం ఉంటున్నారు. పాండీశ్వర్, నిరంజన దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాండీశ్వరన్ కు మణికంఠన్ (38) అనే బావ ఉన్నాడు. మణికంఠన్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిరంజనకు మణికంఠన్ వరుసకు అన్న అవుతాడు.

బావా బావమరిది వ్యాపారం

బావా బావమరిది వ్యాపారం

వరుసకు బావా బావమరిది అయ్యే పాండీశ్వరన్, మణికంఠన్ కలిసి కొన్ని సంవత్సరాల క్రితం సొంత ఊరిలో టీ బంకులు పెట్టి వ్యాపారం చేశారు. టీ వ్యాపారంలో మణికంఠన్, పాండీశ్వరన్ కలిసి బాగా డబ్బులు సంపాదించారు. ఇద్దరు కలిసి మొదలు పెట్టిన వ్యాపారంలో బాగా డబ్బులు సంపాదించడంతో రెండు కుటుంబాలు కొన్ని సంవత్సరాలు చాల సంతోషంగా ఉన్నాయి.

చెల్లి మీద కన్నేసిన కామాంధుడు

చెల్లి మీద కన్నేసిన కామాంధుడు

వరుసకు చెల్లెలు అయ్యే నిరంజన మీద మణికంఠన్ కన్ను పడింది. వరుసకు అన్న అయిన మణికంఠన్ నిరంజనతో చనువుగా ఉంటూ ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు. అంతే కాకుండా నిరంజనకు నిత్యం ఫోన్ లు చేసి తన కోరిక తీర్చాలని, ఈ విషయం బయటకు రాకుండా తాను పాండీశ్వరన్ తో జాగ్రత్తగా ఉంటానని, ఇద్దరు సుఖంగా ఉండాలంటే నా మాట వినాలని మణికంఠన్ వేధింపులకు గురి చేశాడు

పెద్దల పంచాయితీ, వేరే వ్యాపారం

పెద్దల పంచాయితీ, వేరే వ్యాపారం

మణికంఠన్ వేధింపులు ఎక్కువ కావడంతో నిరంజన భర్త పాండీశ్వరన్ కు విషయం చెప్పింది. నిరంజన విషయంలో బావ బావమరదులు మణింకఠర్, పాండీశ్వరన్ గొడవలుపడ్డారు. విషయం తెలుసుకున్న పెద్దలు పంచాయితీ చేసి మణికంఠన్ కు బుద్దిమాటలు చెప్పారు. తరువాత మణికంఠన్, పాండీశ్వర్ టీ వ్యాపారం నిలిపివేసి వేరేవేరే వ్యాపారాలు చేసుకుంటున్నారు.

ఊరకుక్కలా వెంటపడ్డాడు

ఊరకుక్కలా వెంటపడ్డాడు

మణికంఠన్ కు దూరంగా ఉంటున్న పాండీశ్వరన్ భార్య నిరంజనకు వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయి. నిత్యం ఫోన్లు చేసి నిరంజనకు తన కోరిక తీర్చాలని మణికంఠన్ టార్చర్ పెట్టాడు. ఈ విషయంపై విసిగిపోయిన పాండీశ్వరన్, అతని భార్య నిరంజన నేరుగా మణికంఠన్ తమలపాకుల షాప్ దగ్గరకు వెళ్లి అతనితో గొడవ పెట్టుకున్నారు. ఎందుకు ఊరకుక్కలా తన వెంటపడుతున్నావని నిరంజన మణికంఠను నిలదీసింది.

కొడవలితో నరికి చంపేసింది

కొడవలితో నరికి చంపేసింది

మణికంఠ, పాండీశ్వరన్ దంపతుల మద్య మాటామాటా పెరగడంతో నిరంజన తన వెంట తీసుకెళ్లిన కొడవలి తీసుకుని మణికంఠను నరికేసింది. తీవ్రగాయాలైన మణికంఠను ఆసుపత్రికి తరలించగా అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మణికంఠను హత్య చేసిన నిరంజన, ఆమె భర్త పాండీశ్వరన్ నేరుగా వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయారు. పాండీశ్వరన్, నిరంజన దంపతులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే పాండీశ్వరన్, నిరంజన పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

English summary
Tamil Nadu: young couple arrested in murder case near theni due to prejudice and 23 year old woman confessed to police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X