ఓటు వేయడం బాధ్యత.. 3 నెలల చిన్నారితో యువజంట ఓటు.. నెట్టింట్లో ప్రశంసల వర్షం
నాగ్పూర్ : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం సామాజిక బాధ్యత. నేతల తల రాతలు మార్చే శక్తి ఓటుకే ఉంది. సాధారణ ఎన్నికల వేళ చాలామంది ఓటు వేసి.. మేము ఓటేశాం, మీరు వేయండంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన యువజంట తమ 3 నెలల పాపతో వచ్చి ఓటు వేయడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మేము ఓటేశాం.. మీరూ వేయండంటూ ట్విట్టర్ లో ఫోటో పోస్ట్ చేయడం అందర్నీ కదిలిస్తోంది. మీ బాధ్యత సక్రమంగా నెరవేర్చారంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఓటర్లకు మొబైల్ తిప్పలు.. ముందస్తు ప్రచారం చేయని ఈసీ
ఓటు హక్కు వినియోగించుకోవడంలో చాలామంది అలసత్వం ప్రదర్శిస్తుంటారు. ఓటు వేయడం బాధ్యత అనేది మరచిపోతుంటారు. అలాంటి వారికి ఈ యువజంట ఆదర్శమని నెట్టింట్లో కామెంట్లు పెడుతున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు ఆయుధమనేది ఎవరూ మర్చిపోవద్దని సూచిస్తున్నారు.