వారించినా వినలేదుగా: మెట్రో రైలులో రెచ్చిపోయిన ప్రేమజంట: ముద్దులతో ముచ్చట్లు..!
న్యూఢిల్లీ: పీక్ అవర్స్ లో మెట్రో రైలు ఎలా ఉంటుంది? ఎక్కే, దిగే ప్రయాణికులతో కిటకిటలాడుతుంటుంది. నిల్చోవడానికి కూడా స్థలం లభించనంతగా క్రిక్కిరిసిపోయి కనిపిస్తుంటుంది. అలాంటి సమయంలో- మెట్రో రైలులో ఓ ప్రేమజంట రెచ్చిపోయింది. ముద్దు, ముచ్చట్లలో మునిగిపోయింది. లిప్ కిస్ లతో తేలియాడింది. తోటి ప్రయాణికులు వారిస్తున్నా వినిపించుకోకపోవడం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు ఈ ఘటనలో.
దేశ రాజధానిలోని మెట్రో రైలులో చోటు చేసుకున్న ఘటన ఇది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ ప్రేమికుల వివరాలేంటో తెలియరావట్లేదు గానీ.. న్యూఢిల్లీ నుంచి గుర్ గ్రామ్ వరకూ ప్రయాణించినట్లు తెలుస్తోంది. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఆ ప్రేమికుల ప్రయాణం మొత్తం కౌగిలింతల్లోనే సాగింది. తాము దిగాల్సిన స్టేషన్ వచ్చేంత వరకూ అలాగే కనిపించిందా జంట.
మెట్రో రైళ్లల్లో ప్రేమ జంటలు రెచ్చిపోతున్నాయనడానికి తాజా ఉదాహరణ ఈ ఘటన. తోటి ప్రయాణికులు తమనే చూస్తున్నారనే ధ్యాస లేకుండా, వారిస్తున్నా వినిపించుకోకుండా.. కౌగిలింతలు, ముద్దులతో మునిగిపోయారు. తోటి ప్రయాణికుడొకరు వారిని రొమాన్స్ ను వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా హల్ చల్ చేస్తోంది. సుమారు 45 సెకెన్ల పాటు నిడివి ఉన్న వీడియో అది. వారి బాగోతాన్ని బట్టబయలు చేసింది.
This could be us
— Faltu Gyan (@gyan_faltu) December 8, 2019
But I don't have Gf
😀😀#DelhiMetro pic.twitter.com/lxjI9slKlZ
ఈ వీడియో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) అధికారుల కంట్లో పడింది. ఆ ప్రేమికులెవరనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఆ జంటను గుర్తించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. జరిమానాలను విధించడం వల్ల ఉపయోగం ఉండబోదని వ్యాఖ్యానిస్తున్నారు నెటిజన్లు, ట్విట్టరెటీలు.