బెంగళూరులో దారుణం: కోపంగా చూశాడని యువకుడి చంపేశారు, మద్యం మత్తులో!
బెంగళూరు: కోపంగా చూశాడని యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూరు నగరంలోని జ్ఞానభారతి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ముద్దినపాళ్యలో నివాసం ఉంటున్న అరుణ్ కుమార్ అలియాస్ అరుణ్ (22) అనే యువకుడిని కత్తులతోపొడిచి దారుణంగా చంపేశారు.
శుక్రవారం రాత్రి అరుణ్ అతని స్నేహితులతో కలిసి జ్ఞానభారతిలోని మారుతి బార్ అండ్ రెస్టారెంట్ కు వెళ్లాడు. ఆ సమయంలో అరుణ్ కోపంగా చూశాడని ముగ్గురు యువకులు వారితో గొడవ పెట్టుకున్నారు. ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగింది.
ఆ సమయంలో సహనం కొల్పోయిన ఓ వర్గం యువకులు కత్తులు తీసుకుని అరుణ్, కిషన్ మీద దాడి చేశారు. కత్తిపోట్లతో కుప్పకూలిపోయిన అరుణ్, కిషన్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై అరుణ్ మరణించాడని పోలీసులు చెప్పారు. మారుతి బార్ అండ్ రెస్టారెంట్ లోని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నామని, హత్య చేసిన యువకుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.