ప్రాణం తీసిన అక్రమ సంబంధం, కాల్చి బూడిద చేసిన ప్రియురాలు, నేను సరిపోనా ? ఎంత మంది !
చెన్నై: పరాయి స్త్రీతో అక్రమ సంబంధం సాగిస్తున్న ప్రియుడి మీద కక్ష పెంచుకున్న ప్రియురాలు కసితో పెట్రోల్ పోసి నిప్పంటించడంతో తీవ్రగాయాలైన కానిస్టేబుల్ వెంకటేష్ (31) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రియుడు వెంకటేష్ ను పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన అతని ప్రియురాలు ఆషా (32) అనే మహిళను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారి పురుషోత్తమన్ తెలిపారు. హత్యకు గురైన వెంకటేష్ కు భార్య దూరం అయ్యిందని, మరో ఇద్దరు మహిళలతో అక్రమసంబంధం సాగించడం వలనే అతను హత్యకు గురైనాడని పోలీసు అధికారి పురుషోత్తమన్ తెలిపారు.
హైటెక్ వ్యభిచారం: అమ్మాయిలకు పొర్న్ పాఠాలు చెప్పిన లేడీ ప్రొఫెసర్ అరెస్టు, జైలు, గేమ్స్ !
పెళ్లి చేసిన పెద్దలు
తమిళనాడులోని విల్లుపురం నివాసి వెంకటేష్ (31) అవడి 2వ స్పెషల్ పోలీసు బెటాలియన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. 2012వ సంవత్సరంలో కానిస్టేబుల్ వెంకటేష్ జయ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వెంకటేష్, భార్య జయ, కుమారుడు, కుమార్తెతో కలిసి చెన్నైలోని సత్యమూర్తినగర్ లోని పోలీసు క్వాటర్స్ లో కాపురం ఉంటున్నాడు.
అందమైన ఆషా
పులియూరు ప్రాంతానికి చెందిన ఆషా (32) అనే మహిళతో వెంకటేష్ కు పరిచయం అయ్యింది. వెంకటేష్, ఆషా స్నేహం అక్రమ సంబంధానికి దారి తీసింది. ఆషాకు అంతకు ముందే ధర్మలింగం అనే వ్యక్తితో వివాహం అయ్యింది. ఆషా, ధర్మలింగంకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ప్రియుడు వెంకటేష్ మోజులో పడిన ఆషా భర్త, పిల్లలను నిర్లక్షం చేసింది.
ప్రియురాలి మోజులో !
కట్టుకున్న భార్య జయ, కుమారుడు, కుమార్తెను నిర్లక్షం చేసిన వెంకటేష్ ప్రియురాలు ఆషా మోజులో పడిపోయాడు. భర్త వెంకటేష్ అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న భార్య జయ అతనితో గొడవ పెట్టుకుంది. ఆషా విషయంలో వెంకటేష్ ఎదురుతిరగడంతో జయ భర్తను వదిలి 2015లో కుమారుడితో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. కుమార్తె మాత్రం వెంకటేష్ తో ఉండిపోయింది. భార్య జయ పుట్టింటికి వెళ్లిన తరువాత వెంకటేష్ ప్రియురాలు ఆషాను నేరుగా సత్యమూర్తినగర్ లోని పోలీసు క్వాటర్స్ లోని ఇంటికి తీసుకెళ్లి జల్సాలు చేస్తున్నాడు.
సాటి మహిళా పోలీసు
భార్య జయ, ప్రియురాలు ఆషాతో కాకుండా వెంకటేష్ మరో మహిళా పోలీసును పరిచయం చేసుకుని ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జయ మాత్రం భర్త వెంకటేష్ ను వదిలేసింది. అయితే వెంకటేష్, మహిళా పోలీసు అక్రమ సంబంధం విషయం కాస్తా ప్రియురాలు ఆషాకు తెలియడంతో ఆమె రెచ్చిపోయింది.
నీకు నేను సరిపోనా !
రాత్రి పీకలదాక మద్యం సేవించిన వెంకటేష్ ఇంటికి వెళ్లాడు. నేను కాకుండా నీకు మరో మహిళా పోలీసు కావాలసి వచ్చిందా అంటూ ఆషా ప్రియుడు వెంకటేష్ తో గొడవ పెట్టుకుంది. ఆ సమయంలో వెంకటేష్, ఆషా మద్య మహిళా పోలీసు విషయంపై మాటామాటా పెరిగింది. నీకు ఎంజాయ్ చెయ్యడానికి ఇంకా ఎంత మంది అమ్మాయిలు కావాలి, నీ కామం తీర్చడానికి నేను సరిపోనా ? అంటూ ఆషా రెచ్చిపోయింది. ఇంటిలో క్యాన్ లో ఉన్న పెట్రోల్ తీసుకుని మద్యం మత్తులో ఉన్న వెంకటేష్ మీద పోసి నిప్పంటించింది. .
కామంతో బూడిద అయ్యాడు
వెంకటేష్ కు తీవ్రగాయాలు కావడంతో కీల్పాక్కం ఆసుపత్రికి తరలించారు. వెంకటేష్ శరీరం చాలా కాలిపోవడంతో చికిత్స విఫలమై మరణించాడు. ఇన్ స్పెక్టర్ పురుషోత్తమన్ కేసు నమోదు చేసి ప్రియుడు వెంకటేష్ ను హత్య చేసిన ఆషాను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మహిళా పోలీసుతో వెంకటేష్ అక్రమ సంబంధం చూసి తట్టుకోలేక తాను పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశానని ఆషా నేరం అంగీకరించిందని ఇన్ స్పెక్టర్ పురుషోత్తమన్ తెలిపారు.