భర్త నిద్రిస్తుండగానే భార్యపై అత్యాచారం ,ఎలా జరిగింది?
భార్య ,భర్తల మద్య గొడవ భార్యపై అత్యాచారానికి దారితీసింది . భార్యతో గొడవపడి వేరే గదిలో భర్త నిద్రిస్తుండగా, భర్త వద్ద పనిచేసే ఓ యువకుడు భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన న్యూఢిల్లీలో చోటుచేసుక
న్యూఢిల్లీ : భార్య, భర్తలు గొడవపడ్డారు. భార్యపై కోపంతో భర్త ఆమెను గదిలో బంధించి , వేరే గదిలోకి వెళ్ళి నిద్రపోయాడు.అయితే ఇదే అదనుగా భావించిన యువకుడు ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ యువకుడు వారింట్లోనే పనిచేస్తాడు. ఈ ఘటన న్యూఢిల్లీలో చోటుచేసుకొంది.
న్యూఢిల్లీలోని చావ్లా ప్రాంతానికి చెందిన భార్య, భర్తలు గొడవపడ్డారు. ఇద్దరి మద్య తీవ్రంగా గొడవ జరిగింది. భార్యతో గొడవపడిన భర్త కోపంతో ఆమెను గదిలోనే బంధించి వేరే గదిలోకి వెళ్ళి పడుకొన్నాడు.
ఆమె భర్త వద్ద ఓ యువకుడు పనిచేస్తాడు. అయితే భర్త వేరే గదిలోకి వెళ్ళగానే తన గదిలోకి వచ్చిన యువకుడు తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు చెబుతోంది. ఈ విషయమై డిల్లీ పోలీసుకు ఫిర్యాదు చేసింది.
ఈ ఘటనలో భర్త హస్తం ఉందా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ మద్య వివాదంచోటుచేసుకొన్న తర్వాత తాను అలారం మోగించినా భర్త రాకపోవడం పట్ల ఆమె అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ విషయాన్ని ఆమె పోలీసులకు వివరించింది.