వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా జర్నలిస్ట్‌తో అసభ్యకరంగా, హెల్ప్‌కోసం ఏడ్చింది

By Srinivas
|
Google Oneindia TeluguNews

 arrested
బెంగళూరు: కర్నాటకలోని మంగళూరులో వేర్వేరు ఘటనలలో ఓ మహిళా జర్నలిస్టును వేధించగా, మరో ఘటనలో జర్నలిస్టు పైన దాడికి పాల్పడ్డారు. మహిళా జర్నలిస్టును వేధించిన సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. ఆదివారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో సదరు మహిళా జర్నలిస్టు ఇంటికి వెళ్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.

దీంతో ఆమె ఒక్కసారిగా అరిచింది. కాపాడాలని ఏడ్చింది. దీనిని గుర్తించిన స్థానికులు వారిని పట్టుకొని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిపై సెక్షన్ 341, 354ల కింద కేసు నమోదు చేశారు.

మరో ఘటనలో గత బుధవారం విటి ప్రసాద్ అనే విలేకరి పైన కొందరు దాడి చేశారు. ఇతను కన్నడ సాయంకాలం పత్రికలో పని చేస్తున్నారు. ఇతనిపై దాదాపు ముప్పై అయిదు మంది దాడి చేసి కొట్టారు.

కాగా, ఇటీవల మహిళా జర్నలిస్టులు వేధింపులకు గురవుతున్న విషయం తెలిసిందే. కొద్ది నెలల క్రితం ముంబైలో ఓ మహిళా విలేకరిపై సామూహిక అత్యాచారం జరిగింది. తెహెల్కా కేసులో మహిళా జర్నలిస్టుతో అసభ్యంగా ప్రవర్తించిన అభియోగాలను తరుణ్ తేజ్‌పాల్ ఎదుర్కొంటున్నారు.

English summary
In a shocking indicident a woman journalist was molested by two youths on Sunday night near College on December 1.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X