వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్ కోసమే రాళ్లు రువ్వుతున్నారు: ఫరూక్ అబ్దుల్లా

కాశ్మీర్ యువత దేశం కోసమే భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వుతోందని జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ) అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు.

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: కాశ్మీర్ యువత దేశం కోసమే భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వుతోందని జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ) అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు.

మతం పేరుతో విభజించాలనుకుంటున్నవారి పైనే తమ పోరాటం అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి తాను ఓ విషయం చెప్పదలుచుకున్నానని, టూరిజం మా జీవితం అని, అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పారు.

Youth pelting stones sacrificing lives for Kashmir, not tourism: Farooq Abdullah

అలాగే, రాళ్లు విసరడం వల్ల టూరిజానికి వచ్చిన ముప్పేమీ లేదన్నారు. వారు దేశం కోసం రాళ్లు విసురుతున్నారన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. భారత్-పాక్‌లు తమ సమస్యలను పరిష్కరించుకోలేవని, ఈ విషయంలో అమెరికా మధ్యవర్తిత్వం అవసరమని, ఆ దేశం ముందుకు రావాలన్నారు.

కాగా, ఇటీవల అతిపెద్ద టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ కాశ్మీర్ యువతను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాశ్మీర్ యువతకు ఓ వైపు తీవ్రవాదం, మరోవైపు పర్యాటక రంగం అందుబాటులో ఉన్నాయని, రెండింటిలో పర్యాటకాన్ని ఎంచుకోవాలని హితవు పలికారు. దీనికి ఫరూక్ అబ్దుల్లా కౌంటర్ ఇచ్చారు.

English summary
Farooq Abdullah said that Youth pelting stones sacrificing lives for Kashmir, not tourism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X