యువతితో అసభ్యంగా: నడిరోడ్డులో దుమ్ములేపేశారు, గుండు కొట్టించి ఊరేగింపు ! (వీడియో)
యువతితో అసభ్యంగా, నడి రోడ్డులో దుమ్ములేపేశారు నడి రోడ్డులో గుండు కొట్టించి ఊరేగింపు ఇద్దరం ప్రేమించుకుంటున్నామని, యువకుడి ఆవేదన
శివపురి: ప్రతినిత్యం యువతిని వేదిస్తున్నాడని ఆరోపిస్తూ ఆమె కుటుంబ సభ్యులు యువకుడిని నడి రోడ్డులో చితకబాదేశారు. తరువాత యువకుడికి గుండు కొట్టించి ఊరేగింపు చేసిన ఘటన మధ్యప్రదేశ్ లోని శివపురి నగరం సమీపంలో జరిగింది.
23 ఏళ్ల యువకుడు అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న 21 ఏళ్ల యువతిని వేదిస్తున్నాడని సమాచారం. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు సహనం కోల్పోయారు. యువకుడిని నడిరోడ్డులోకి లాక్కొచ్చి అతన్ని చితకబాదేశారు.
తరువాత రోడ్డులోనే అతనికి గుండు కొట్టించి ఆ ప్రాంతంలో ఊరేగించారు. అయితే యువకుడు మాత్రం తాను ఏ తప్పు చెయ్యలేదని అంటున్నాడు. తను, ఆ అమ్మాయి ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించామని ఆ యువకుడు అంటున్నాడు.
యువతికి వేరే వ్యక్తితో పెళ్లి చెయ్యాలని నిర్ణయించిన ఆమె కుటుంబ సభ్యులు నేరం తన మీద వేసి నడి రోడ్డులో గుండు కొట్టించి ఊరేగించి అవమానించారని ఆరోపించాడు. యువకుడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. యువతి కుటుంబ సభ్యులు సైతం యువకుడి మీద కేసు పెట్టారు. ఇరువర్గాలు ఫిర్యాదు చేశారని, విచారణ చేస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు.