ఈ సారి బౌద్దారామంపై: ఏపీ సర్కార్పై నిప్పులు, విశాఖ తొట్లకొండను రక్షించుకోవాలి: ఎంపీ రఘురామ
విశాఖ తొట్లకొండలో గల బౌద్ధారామాన్ని పరిరక్షించుకోవాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. బౌద్ధారామం పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్తో మాట్లాడానని వెల్లడించారు. ఆ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టొద్దని సూచించారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
తొట్లకొండ ప్రాంతంలో ఇతర నిర్మాణాలు చేపట్టొద్దు అని.. నిర్మిస్తే చారిత్రక ప్రాశస్త్యం అంతరించిపోతుందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడానని పేర్కొన్నారు. ఇక్కడ గల బౌద్ధారామం ఆకృతులే ఇండోనేషియాలోని గోడో బుదూర్ ప్రాంతంలో ఉన్నాయని వివరించారు. అక్కడ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్తుచేశారు. మనం కూడా ఇక్కడ గల బౌద్ధారామాన్ని పరిరక్షించుకోవాలని కోరారు.
Recommended Video
తొట్లకొండ ప్రాంతం రాష్ట్ర పురావస్తుశాఖ పరిధిలో ఉంది అని రఘురామ తెలిపారు. అయితే చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత ఉన్న ప్రదేశంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేపట్టడం సరికాదన్నారు. నిర్మాణాలు నిలిపివేయాలని.. లేదంటే ప్రాంతాన్ని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలోనికి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారని తెలిపారు. ఇందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.
Met Hon’ble Tourism & Culture Minister Shri @prahladspatel Ji and discussed about the development of tourist & heritage sites in my Narsapuram constituency and submitted representation to preserve Buddhist Monument sites at Kapuluppada village, Visakhapatnam. pic.twitter.com/HTszkKCjBh
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) August 28, 2020