సోషల్ మీడియాలో జోరు: హార్దిక్ పటేల్కు మార్క్ జుకర్బర్గ్ ఆహ్వానం!
గాంధీనగర్: పటేళ్ల రిజర్వేషన్ల కోసం గుజరాత్ రాష్ట్రంలో పోరాటం చేస్తున్న పాటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హార్దిక్ పటేల్కు ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ సిలికాన్ వ్యాలీకి ఆహ్వానించినట్లు వార్తలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి.
గుజరాత్ ఎన్నికల్లో కీలకంగా హార్దిక్ పటేల్ కీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. పటేల్ రిజర్వేషన్లపై హామీ ఇవ్వడంతో తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నట్లు హార్దిక్ ప్రకటించారు. అంతేగాక, బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా హార్దిక్ ప్రచారం చేస్తున్నారు.
గుజరాత్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు హార్ధిక్ పటేల్ కాగా, సూరత్లో చేసిన ప్రసంగాన్ని 37వేల మంది ఆన్ లైన్లో వీక్షించినట్లు తెలిసింది. అహ్మదాబాద్కు చెందిన మేరా న్యూస్ కథనం ప్రకారం.. 'నవంబర్ 27న పటేల్స్ కన్జర్వేషన్ ను ఫేస్బుక్లో 60వేల లైక్స్ వచ్చాయి. 5వేల మంది అభిమానులు దాన్ని షేర్ కూడా చేశారు. హార్ధిక్ పటేల్ కు సోషల్ మీడియాలో 8,50,000మంది ఫాలోవర్లు ఉన్నారు' అని పేర్కొంది. హార్దిక్ అధికారిక ఫేస్బుక్ పేజీకి 8లక్షలకుపైగా లైక్స్ ఉండటం గమనార్హం. ఇది బీజేపీకి ఉన్నదాంట్లో 1/3వంతు కావడం గమనార్హం.