8,4701 కోట్లు: అత్యంత ఖరీదైన డైవోర్స్ ఇదే
బీజింగ్: చైనాలో ఓ యువ జంట విడిపోయింది. వీరు విడిపోవడం విషయమేమో కానీ ఇప్పుడు వీరి విడాకులే అత్యంత ఖరీదైనదిగా వార్తల్లోకి ఎక్కారు. విడిపోయే సమయంలో అప్పటి వరకు జీవితంలో సగభాగంగా జీవించిన భార్యకు సగం ఆస్తి ఇవ్వడం చాలా అరుదు.
కానీ చైనాలో ఈ ఆసక్తికర సంఘటన జరిగింది. వీడియో గేమ్లను తయారు చేసే ప్రముఖ సంస్థ బీజింగ్ కున్లున్ టెక్ కంపెనీ చైర్మన్, సీఈవో ఝౌ యుహి (39) తన భార్యనుంచి విడాకులు తీసుకుంటున్న సందర్భంగా ఆస్తిలో సగాన్ని ఆయన తన భార్యకు చెల్లించాల్సి వస్తోంది.
తన భార్య లీ (38) నుంచి విడిపోవాలని అతను నిర్ణయించుకున్నాడు. తమ ఆస్తుల నుంచి ఆమెకు రూ.8,470 కోట్లు ఇవ్వనున్నాడు. భార్యాభర్తలిరువురి పేరటి మొత్తం రూ.26,000 కోట్లు ఆస్తులు ఉన్నాయి.
వారి ఆస్తుల్లో రూ.17 వేల కోట్లు ఇద్దరూ పంచుకోవాల్సి ఉంది. ఇందులో భాగంగా ఇరువురికీ రూ.8,470 కోట్లు వస్తాయని చెబుతున్నారు. తమ దేశంలో అత్యంత ఖరీదైన విడాకులు ఇవేనని అక్కడి స్థానిక వార్త పత్రికలు పేర్కొంటున్నాయి.
విడాకుల అంశంలో గతంలో ఆ దేశంలో ఒక వ్యాపారి తన రష్యా భార్యకు రూ.7,400 కోట్లు చెల్లించాడు. వారి పేరిటే ఇప్పటివరకు ఖరీదైన విడాకుల రికార్డు ఉంది. తాజాగా యుహి జంట బ్రేక్ ఆ రికార్డుని అధిగమించనుంది.