సుడాన్లో మిలిటరీ దారుణం... 100 మందిని చంపి నైలు నదిలో వేసిన వైనం..
సూడాన్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించాలని ఆందోళన కొనసాగిస్తున్న ఉద్యమకారులపై అక్కడి సైన్యం ఉక్కుపాదం మోపుతోంది.దీంతో అందోళన నిర్వహిస్తున్న ఉద్యమకారులను అతిదారుణంగా చంపి నదిలో పడేస్తున్నాయి మిలిటరీ దళాలు. ఇప్పటికే 100 మందిని చంపారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.
సూడాన్ దేశ ఆర్ధిక రంగం పూర్తిగా చితికి పోవడంతో గత ఏడాది ఆ దేశ అధ్యక్షుడు బషిర్ అత్యవసర చర్యలు చేపట్టాడు. దీంతో నిత్యవసరాల వాడుకపై అంక్షలు విధించారు. దీంతో ప్రజల తిరుగుబాటు తీవ్రతరం చేశారు. ఈనేపథ్యంలోనే అధ్యక్షుడని దించిన సైన్యం ప్రభుత్వాన్ని తన అధీనంలోకి తీసుకుంది. అయినప్పటికి ప్రజల అందోళలు మాత్రం గత సంవత్సర కాలం నుండి కొనసాగుతున్నాయి.
ఈనేపథ్యంలోనే ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ...మంగళవారం మరోసారి ఆందోళలు జరిగాయి. ఈనేపథ్యంలోనే మిలిటరీ అధికారులు 40మంది ఆందోళనకారులను చంపి నైలు నదీలో పడేశారని, వారిని నది నుండి వెలికి తీశామని , పోరాటం చేస్తున్న సూడనీస్ సెంట్రల్ కమిటి పేర్కోంది. దీంతోపాటు ఇదే విధంగా 100మందిని చంపారని వారి మృతదేహలను ఆసుపత్రిలో కనుగొన్నామని వారు చెబుతున్నారు.