అమెరికాలో కాల్పుల కలకలం, 11 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
అమెరికాలో తుపాకుల మోత మోగింది. న్యూ అర్లిన్స్ వద్ద కాల్పులు శబ్దం వినిపించింది. ఫైర్ చేయడంతో 11 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పులు ఎవరు జరిపారు ? ఎందుకు జరిపారనే అంశంపై స్పష్టత లేదు.
అమెరికాలోని న్లూ అర్లిన్స్ పర్యాటక ప్రాంతం. వీకెండ్ కావడంతో సందర్శకులు తాకిడి ఎక్కువగానే ఉంది. ఫ్రెంచ్ క్వార్టర్ వద్ద అమెరికా కాలమనం ప్రకారం ఉదయం 3 గంటలకు కాల్పులు జరిగాయి. రద్దీగా ఉండే వాణిజ్య సముదాయ వీధిలో.. చారిత్రక హోటళ్లు ఉన్న సమీపంలో కాల్పులు జరిగాయి. ఇప్పటివరకు ఒకరు కూడా చనిపోలేదని పేర్కొన్నారు.
కాల్పులు జరిగిన వెంటనే పోలీసులు స్పందించామని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఫుట్ బాల్ థాంక్స్ గివింగ్ కార్యక్రమానికి హాజరైన వారు కూడా రియాక్టయ్యారని పేర్కొన్నారు. కాల్పుల ఘటనకు సంబంధించి ఎవరినీ అదుపులోకి తీసుకోలేమని అక్కడి పోలీసురు.
అమెరికాలో శ్వేత జాతీయులు ఇతరదేశాలకు చెందినవారిపై కాల్పులకు తెగబడుతుంటారు. అక్కడ పనిచేసే విద్యార్థులపై విచక్షణారహితంగా ఫైర్ చేస్తుంటారు. తెలుగురాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా చాలామంది చనిపోయారు. మైసూరుకు చెందిన అభిషేక్ సుదేశ్ భట్ను గురువారం హోటల్లో కొందరు దుండగులు కాల్పులు జరిపి హతమార్చిన సంగతి తెలిసిందే.