వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మెన్సా టెస్ట్: ఐన్స్టీన్ మించిన భారతసంతతి బాలిక
లండన్: బ్రిటన్కు చెందిన 11 ఏళ్ల భారత సంతతి బాలిక అరుదైన రికార్డు నెలకొల్పింది. తెలివితేటలను లెక్కించే మెన్సా పరీక్షలో ప్రథమ స్థానం గెలుచుకుంది. ఆమె ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్స్ వంటి వారికే సాధ్యమైన ఐ క్యూని మించిపోయింది.
ఇందులో 162 గాను 162 అత్యధిక స్కోరు సాధించి రికార్డు సృష్టించింది. ఈ రికార్డుతో ముంబైలో పుట్టిన కాష్మియా వాహి(11)కి బ్రిటన్లోని అత్యంత తెలివైన శాస్త్రవేత్తల బృందంలో చోటు దక్కింది. తనకు ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం ఎంతో ఆనందాన్నిచ్చిందని కాష్మియా పేర్కొంది.
ఆమె తల్లిదండ్రులు వికాస్, పూజావాహి ఐటీ కన్సల్టెన్సీలో ఉద్యోగులు. కాట్టెల్ 3బి మెన్సా పరీక్షలో 150 ప్రశ్నలుంటాయి. ఇందులో పెద్దలు అత్యధికంగా 161, 18 ఏళ్లలోపు వారు 162 స్కోరు తెచ్చుకునే అవకాశముంది. కాగా, అండర్-18 విభాగంలో వాహి 162 పాయింట్లు సాధించింది.
Comments
English summary
A 11-year-old Indian-origin girl in the UK has achieved the top possible score of 162 on a IQ test of Mensa, becoming one of the youngest brainiest students in the country.
Story first published: Monday, January 11, 2016, 16:12 [IST]