12 దేశాల్లో నో కరోనా: ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు: యూఎన్వో
కరోనా పేరు చెబితే గుండెల్లో గుబులు రేగాల్సిందే. అసలు వైరస్ సోకని ప్రాంతం అంటూ ఏదీ లేదు. అని ప్రపంచంలో 12 దేశాల్లో మాత్రం కరోనా వైరస్ పేరు వినిపించడం లేదు. ఆశ్చర్యంగా ఉన్న ఇదీ నిజం. కరోనా వైరస్కి సంబంధించి ఐక్యరాజ్యసమితి 193 దేశాలను గుర్తించింది. అయితే 12 దేశాల్లో మాత్రం జూలై 19వ తేదీ ఆదివారం నాటికి ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని పేర్కొన్నది.
ఉత్తరకొరియా, పలావు, సమోవా, వనాటు, టువాలు, మార్షల్ దీవులు, పలావు, నౌరు, కిరిబాటి, మైక్రోనేషియా, సోలమన్ దీవులు, టోంగా దేశాల్లో ఒక్క కరోనా వైరస్ కేసు నమోదు కాలేదు. ఈ దేశాలు చాలా వరకు ఓషియానియాలోని పసిఫిక్ మహాసముద్ర ద్వీపదేశాలే కావడం విశేషం. ఇప్పటివరకు కోటికి పైగా కేసులు, 6 లక్షలకు పైగా మరణాలతో ప్రపంచం తల్లడిల్లిపోతోండగా.. 12 దేశాల్లో వైరస్ లేకపోవడం సానుకూల అంశమే.
Recommended Video
చైనాలో కరోనా వ్యాప్తి జరుగుతోందని తెలియగానే ఉత్తర కొరియా సరిహద్దులు పూర్తిగా మూసేసి తమ దేశంలోకి వైరస్ ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకుంది. తుర్క్ మెనిస్థాన్ కూడా మొదట్లోనే చైనాతో విమానాలు రద్దు చేసింది. మిగతా దేశాలతో గల సరిహద్దులను మూసివేసింది. విదేశాల నుంచి వచ్చేవారికి పసిఫిక్ ద్వీప దేశాల కఠిన నిబంధనలు అమలు చేశాయి. 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేసింది. డాక్టర్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతి ఇస్తూ.. కఠిన నిబంధనలను అమలు చేసింది. దీంతో పాజిటివ్ కేసులు నమోదు కాలేదని యూఎన్వో పేర్కొన్నది.