వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హెచ్చరికలు బేఖాతరు: అమెరికాకు షాకిచ్చిన భారత్ సహా 128 దేశాలు
న్యూయార్క్: జెరూసలేం విషయంలో అమెరికాకు ఐక్యరాజ్య సమితిలో చుక్కెదురైంది. ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలెంకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గుర్తింపును ఉపసంహరించుకోవాలని పేర్కొంటూ చేసిన తీర్మానానికి భారీ మద్దతు లభించింది.
ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో గురువారం ఈ తీర్మానానికి అనుకూలంగా భారత్ సహా 128 దేశాలు ఓటు వేశాయి. ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన దేశాలకు అమెరికా ఆర్థిక సహాయంలో కోత పెడతామని ట్రంప్ హెచ్చరించారు.
అయినప్పటికీ ఆ బెదిరింపులను పట్టించుకోలేదు ఈ 128 దేశాలు. ట్రంప్ హెచ్చరికల ప్రభావం స్వల్పంగా మాత్రమే కనిపించింది. కేవలం 9 దేశాలు మాత్రమే ఈ తీర్మానాన్ని వ్యతిరేకించాయి.
అయితే అమెరికాకు మిత్ర దేశాల్లో కొన్ని పాశ్చాత్య, అరబ్ దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం గమనార్హం. 35 దేశాలు ఓటింగ్ నుంచి గైర్హాజరయ్యాయి.
Comments
india jerusalem united states donald trump israel ఇండియా భారత్ జెరూసలేం అమెరికా యూనైటెడ్ స్టేట్స్ డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్
English summary
India on Thursday joined 127 other countries to vote in the United Nations General Assembly in favour of a resolution opposing the recent decision of US President Donald Trump to recognise Jerusalem as Israel's capital.
Story first published: Friday, December 22, 2017, 13:01 [IST]