కెనడాలో రైలు ప్రమాదం.. 13 మంది మృతి
కొత్త సంవత్సంలోకి అడుగుపెడుతున్నవేళ కెనడాలో విషాదం చోటుచేసుకుంది. అక్కడ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ఐదుగురు రైల్వే సిబ్బందితో పాటు 8 మంది ప్రయాణీకులు చనిపోయారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున ఉదయం 6.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు లోకల్ మీడియా పేర్కొంది.
మనీటోబా ఫ్రావిన్స్ లోని పోర్టిగాలా ప్రైరీ ఏరియాను దాటుతుండగా ఇంజన్ అకస్మాత్తుగా పట్టాలు తప్పడంతో ఐదారు బోగీలు బోల్తా పడ్డాయి. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటంతో పెనువిషాదం తప్పినట్లయిందని, ఇప్పటివరకు 13 మంది చనిపోయినట్లు నిర్ధారించారని మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
మనీటోబా ప్రావిన్స్ రైలు ప్రమాద ఘటనను సీరియస్ గా తీసుకున్న కెనడా యంత్రాంగం.. ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు ప్రారంభించింది. చనిపోయినవారి మృతదేహాలను గుర్తించి, బంధువులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. కెనడా రవాణ భద్రతా బోర్డు ప్రత్యేకంగా ఎంక్వైరీకి ఆదేశించినట్లు వార్తలొచ్చాయి.