Bloodiest Day: మయన్మార్లో నిరసనకారులపై కాల్పులు: 18 మంది మృతి, 30 మందికి గాయాలు
యాంగూన్: సైనిక పాలనను వ్యతిరేకిస్తూ, అంగ్ సాన్ సూకిని విడుదల చేయాలంటూ దేశ వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. దేశంలో అతిపెద్ద నగరమైన యాంగూన్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన ప్రజలపై ఆదివారం పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 18 మంది మృతి చెందారు. మరో 20 మందికిపైగా ప్రజలు గాయపడ్డారు.
కాగా, కాల్పులు జరిపిన పోలీసులకు సైనికాధికారులు మద్దతుగా నిలవడం గమనార్హం. పోలీసుల కాల్పుల్లో గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రిలో ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
శాంతియుతంగానే నిరసన చేస్తున్నప్పటికీ.. పోలీసులు, సైనికులు కాల్పులు జరపడం విమర్శలకు తావిస్తోంది. ప్రజల ద్వారా ఎన్నికైన నేత అంగ్ సాన్ సూకీని బంధించి, సైనిక పాలనను విధించడంపై ప్రపంచ దేశాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
పోలీసుల
జరిపిన
కాల్పులపై
ఐక్యరాజ్యసమితి
మానవ
హక్కుల
సంఘం
ఆగ్రహం
వ్యక్తం
చేసింది.
శాంతి
ప్రదర్శన
చేస్తున్నవారిపై
కాల్పులు
జరపడం
అమానుషమని
మండిపడింది.
ప్రపంచ
దేశాలు
కూడా
తాజా
ఘటనపై
ఆగ్రహం
వ్యక్తం
చేస్తున్నాయి.
Myanmar army kill single mother in Mandalay. pic.twitter.com/4TVKvcpsoH
— Sue nit (@Suenit6) February 28, 2021
కాగా, ఫిబ్రవరి 1న ప్రజల ద్వారా ఎన్నికైన అంగ్ సాన్ సూకీ, ఇతర అధికార పార్టీ నేతలను సైనికాధికారులు నిర్బంధించి, దేశంలో సైనిక పాలనను ప్రకటించారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దేశ ప్రజలు ఆ నాటి నుంచి ఆందోళనలు చేస్తున్నారు.
Save myanmar . pic.twitter.com/XgurlubwOO
— Ze Khao (@khao_ze) February 28, 2021
ఇప్పటికే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్.. సైనికాధికారులకు సంబంధించిన ఖాతాలను తొలగించడం గమనార్హం. మయన్మార్ దేశంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.