వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కొండ మీద నుంచి జారిపడ్డ ట్రక్కు.. 18 మంది మృతి
కాట్మాండు : నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ ట్రక్కు అదుపుతప్పి కొండమీద నుంచి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 18 మంది చనిపోయారు. మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం సాయంత్రం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కింతాంగ్ నుంచి సిసిఫ్ వైపు వెళుతున్న ట్రక్కు మార్గమధ్యంలో అదుపుతప్పింది. దీంతో కొండపై నుంచి ఒక్కసారిగా నదిలో పడిపోయింది. ఆ సమయంలో 40-50 మంది ప్రయాణీకులు అందులో ఉన్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న భద్రతాసిబ్బంది తక్షణమే సహాయకచర్యల్లో మునిగిపోయారు. గాయపడ్డవారిని కాట్మాండు ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. పరిమితిని మించి ప్రయాణీకులు ఎక్కడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
Comments
English summary
A road accident in Nepal has been reported. The mini truck crippled down the river from the hill. 18 people were killed in the incident. Another 16 people were seriously injured.
Story first published: Sunday, December 16, 2018, 9:45 [IST]