వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంహెచ్370: 19వసెంచరీ ఓడ శకలాలు లభ్యం(ఫోటో)

By Srinivas
|
Google Oneindia TeluguNews

సిడ్నీ: ఇరవై నెలల క్రితం అదృశ్యమైన ఎంహెచ్ 370 విమానం శకలాల కోసం వెతుకుతుండగా ఓ ఓడకు సంబంధించిన శకలాలు బయటపడ్డాయి. 2014 మార్చిలో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయలుదేరిన ఎంహెచ్ 370 విమానం గల్లంతైన విషయం తెలిసిందే.

దీని ఆచూకి ఇప్పటి వరకు గుర్తించలేదు. ఈ విమానం శకలాల కోసం ఇంకా వెతుకులాట కొనసాగుతోంది. నాడు ఆ విమానంలో 239 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం ఆచూకీ కనుగొనేందుకు ఆస్ట్రేలియా నేతృత్వంలోని బృందం దక్షిణ హిందూ మహాసముద్రంలో గాలింపు చర్యలు కొనసాగిస్తోంది.

1800s shipwreck found during search for Malaysia Airlines Flight 370

ఈ మహా సముద్రంలో వెతుకులాడుతుండగా.. ఓడ శకలాలు లభ్యమయ్యాయి. సముద్రపు అడుగుభాగన అవి కనిపించాయి. ఇలా ఎంహెచ్ 370 కోసం వెతుకుతుండగా ఓడ శిథిలాలు కనిపించడం ఇది రెండోసారి. గత ఏడాది డిసెంబర్ నెలలో 200 ఏళ్ల క్రితం ఓడ శిథిలాలు లభించాయి.

తాజాగా ఇప్పుడు కనిపించిన శిథిలాలు.. 19వ సెంచరీకి చెందినవి అయి ఉంటాయని భావిస్తున్నారు. ఈ ఓడ స్టీల్ లేదా ఐరన్‌తో చేసి ఉంటారని భావిస్తున్నారు. ఎంహెచ్ 370 కోసం వెతుకుతుండగా.. ఇప్పటికి రెండుసార్లు పాత ఓఢ శకలాలు దొరికాయి. కానీ విమాన శకలాలు మాత్రం లభ్యం కాలేదు.

English summary
1800s shipwreck found during search for Malaysia Airlines Flight 370.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X