వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జపాన్ నౌకలో కరోనా కలకలం: ఇద్దరు భారతీయ సిబ్బందికి పాజిటివ్, వైద్య పరీక్షలు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కలకలం రేపుతోంది. చైనాలోని వుహన్‌లో వెలుగులోకి వచ్చిన రక్కసి.. క్రమంగా ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. కేరళలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు జపాన్ తీరంలో డైమండ్ ప్రిపెన్స్ క్రూయిజ్ షిపులో కూడా కరోనా వైరస్ జాడ కనిపించింది. అయితే అందులో పనిచేసే ఇద్దరు భారతీయ సిబ్బంది అని గుర్తించారు.

ఇద్దరికి పాజిటివ్

ఇద్దరికి పాజిటివ్

జపాన్ క్రూయిజ్‌లో గల సిబ్బంది ఇద్దరు ఇండియాకు చెందినవారు అని జపాన్ ప్రభుత్వం భారత్‌కు సమాచారం అందజేసింది. దీనిని భారత విదేశాంగ శాఖ బుధవారం ధృవీకరించింది. క్రూయిజ్ షిప్‌లో మొత్తం 3711 మంది ఉన్నారని.. అందులో 2666 మంది ప్రయాణికులు అని, 1045 మంది సిబ్బంది ఉన్నారని పేర్కొన్నారు. 132 మంది సిబ్బంది, ఆరుగురు ప్రయాణికులు భారతీయ పౌరులని ధృవీకరించింది.

174 మందికి పాజిటివ్

174 మందికి పాజిటివ్


కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నౌకలో ఉన్న వారికి పరీక్షలు చేయగా 174 మందికి పాజిటివ్ వచ్చింది. ఇందులో ఇద్దరు భారతీయ సిబ్బంది ఉన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి తగిన చికిత్స అందిస్తామని జపాన్ ఆరోగ్యశాఖ తెలిపింది.

అలర్ట్

అలర్ట్


నౌకలో ఉన్న భారతీయ సిబ్బందికి వైరస్ సోకిందనే సమాచారంతో భారత అధికారులు అప్రమత్తమయ్యారు. జపాన్ అధికారులతో రాయబార కార్యాలయ అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. అక్కడ వారికి అన్నీ పరీక్షలు చేస్తున్నారని అధికారులు తెలిపారు.

English summary
Two Indian crew on board cruise ship Diamond Princess off Japanese coast tested positive for the coronavirus on Wednesday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X