వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోయలో పడిన బస్సు: 20మంది క్రీడాకారుల మృతి

|
Google Oneindia TeluguNews

మెక్సికన్ సిటీ: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతిచెందగా, మరో 25 మంది గాయపడ్డారు.

అక్కడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వెరాక్రూస్‌ ప్రాంతంలో 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జి రెయిలింగ్‌ను ఢీకొని అటోయక్‌ నదిలో పడిపోయింది.

ప్రమాద సమాచారం అందుకున్న సహాయ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికులంతా కమరోన్‌, కోర్డోబా ప్రాంతాలను చెందిన ఫుట్‌బాల్‌ క్రీడాకారులేనని అధికారులు తెలిపారు.

బస్సు డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే అదుపులో తప్పి లోయలో పడివుంటుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఘటనపై మెక్సికన్ అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నియటో తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

English summary
Twenty people died when a bus plunged off a bridge in southern Mexico and fell into a deep gorge, officials said Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X