మరో 17 మంది జవాన్ల మృతి, 20కి చేరిన సంఖ్య: ఇండియన్ ఆర్మీ
తూర్పు లడాఖ్ గాల్వాన్ వ్యాలీ వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో మృతుల సంఖ్య పెరుగుతోంది. కల్నల్, ఇద్దరు జవాన్లు చనిపోయారని తొలుత ప్రకటించినా.. తర్వాత ఆ సంఖ్య చేరింది. వాస్తవానికి అక్కడ జరో డిగ్రీ టెంపరేచర్ ఉంటుంది.
Recommended Video
నలుగురు కాదు 43 మంది, పలువురు గాయపడ్డారు కూడా, పెరిగిన చైనా జవాన్ల మృతుల సంఖ్య..?
గాయపడి మరణించిన వారి సంఖ్య 20 వరకు చేరింది. దేశ సమగ్రత, సార్వభౌమత్వం కాపాడేందుకు భారత సైన్యం కట్టుబడి ఉంది అని పేర్కొన్నది. మరోవైపు సోమవారం రాత్రి జరిగిన ఘర్షణను భారత ఆర్మీ ధృవీకరించింది. గాల్వాన్ ప్రాంతం నుంచి భారత్, చైనా దళాలు వెనక్కి వెళ్లిపోయాయని పేర్కొన్నది.
గాల్వాన్ ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు చనిపోయారని భారత సైన్యం పేర్కొన్నది. కల్నల్, ఇద్దరు జవాన్లు సహా.. మంచులో ఇరుక్కుపోయి, తీవ్రగాయాలైన మరో 17 మంది చనిపోయారని నివేదించింది.సోమవారం రాత్రి ఘర్షణతో ఇరుదేశాలు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. మంగళవారం రెండుసార్లు అత్యున్నత సమావేశం నిర్వహించారు. త్రివిధ దళాల అధిపతులతో సమావేశం నిర్వహించి.. వాస్తవ పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వివరించారు.