కిరాతకం: నిద్రిస్తున్న 20 మంది కూలీలను కాల్చి చంపేశారు
ఇస్లామాబాద్: కష్టపడి పని చేసిన తరువాత భోజనం చేసి నిద్రపోతున్న వారి మీద కిరాతకులు కాల్పులు జరిపారు. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 20 మంది కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ముగ్గురు కార్మికులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.
పాకిస్థాన్ లోని బెలూచిస్థాన్ లోని టుర్బట్ నగరం శివార్లలోని లేబర్ క్యాంప్ లో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విదంగా ఉన్నాయి. సింద్, పంజాబ్ ప్రాంతాలకు చెందిన కార్మికులు టుర్బట్ నగరం శివర్లాలలో జరుగుతున్న బ్రిడ్జ్ నిర్మాణం పనులు చెయ్యాడానికి వెళ్లారు.

శుక్రవారం రాత్రి వరకు పనులు చేసి లేబర్ క్యాంప్ లోని గుడారాల దగ్గరకు వెళ్లారు. తరువాత భోజనం చేసి అందరూ నిద్రపోయారు. శనివారం వేకువ జామున గాఢ నిద్రలో ఉన్న సమయంలో గుర్తు తెలియన వ్యక్తులు తుపాకులు తీసుకు వచ్చి కార్మికుల మీద విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.
20 మంది సంఘటనా స్థలంలో ప్రాణాలు వదిలారు. బుల్లెట్ లు దూసుకు వెళ్లడంతో మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా తయారైనాయని పోలీసులు అన్నారు. ఉగ్రవాదులే కార్మికులను చంపి ఉంటారని వెలుగు చూసింది. అయితే కార్మికులను ఎందుకు హత్య చేశారనేది తెలియడం లేదని దర్యాప్తు చేస్తున్నామని పాకిస్థాన్ పోలీసు అధికారులు తెలిపారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications